మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ రికార్డుల వేట మొదలైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విడుదలకు మూడు రోజులు ఉండగానే ఆంధ్రప్రదేశ్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, టికెట్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. గత 24 గంటల్లోనే ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఏకంగా 70,000 టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. చివరి గంటకు 5,000 కి పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్లో దూసుకుపోతోంది ‘పెద్ది’. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే ఛాన్స్ ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా, అలాగే ఇంటర్నేషనల్ వైడ్ గా ‘పెద్ది’పై మంచి బజ్ నెలకొంది. నార్త్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సినిమా పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. నార్త్ అమెరికాలో (North America) అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్ షోల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా ‘పెద్ది’పై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. తొలిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి థియేటర్లలో ‘పెద్దిగాడి’ రికార్డుల వేట ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి!
