Rajinikanth: వారికి రజినీకాంత్ కూతుళ్లే టార్గెట్.. మొన్న పెద్దకూతురు.. నేడు చిన్న కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనం చేయాలంటే.. దొంగలు కూడా భయపడుతూ ఉంటారు. పోలీస్ కేసులు, మీడియా అటెన్షన్.. మాములుగా ఉండవు అని.. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే దొంగలు మాత్రం కేవలం సెలబ్రిటీస్ నే టార్గెట్ చేస్తున్నారు.. అందులోనూ ముఖ్యంగా రజినీకాంత్ కూతుర్లే వారి టార్గెట్. అవును.. ఈ మధ్యనే రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో చోరీ సి జరిగిన విషయం తెల్సిందే. రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు పోయాయి అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఇంట్లో పనిచేస్తున్న పనివారే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేల్చేశారు. ఇక ఆ చోరీ ఘటన జరిగి నెల రోజులు అయ్యిందో లేదో.. ఇప్పుడు రెండో కూతురు ఇంట దొంగతనం జరిగింది.
NTR 30: ఇంట గెలిచి.. రచ్చ గెలువు పాప
Also Read
- Mr. Work From Home : మే 15న థియేటర్లలో 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'
- Posani : "ఆపరేషన్ అరుణారెడ్డి" మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
రజినీ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ ఇంట దొంగతనం జరిగింది. ఆమె తన ఎస్యూవీ కారు యొక్క కీ ని పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చేలోపు తన కీని ఎవరో కొట్టేశారని తెలుపుతూ చెన్నైలోని తేనాంపేట పోలీసు స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. కారు తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లానని, కాలేజీ ఫంక్షన్ కు వెళ్లి వచ్చేలోపు కీ కనిపించడం లేదని తెలిపింది. ఇక ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు కీ ని వెతికి ఇస్తామని తెలిపారు. అదేం విచిత్రమో కానీ, రజినీ ఇద్దరు కూతుళ్లు ఇలా దొంగతనం కేసుల్లో హైలైట్ గా మారింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’
-
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. నేడు ఈ రాశివారు అనుకున్న పని నేరవేరుతుంది..!
-
Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?