Manjummal Boys: ఇండస్ట్రీ హిట్ సినిమాకి పివిఆర్ ఐనాక్స్ షాక్.. ఎమర్జెన్సీ మీటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మలయాళ చిత్రసీమ మొత్తాన్ని షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాని తెలుగులో వారం రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఏప్రిల్ ఆరవ తేదీన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, సినిమా నిర్మాణ సంస్థ పరవ ఫిలింస్ తో కలిసి తెలుగులో రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాని చెప్పా పెట్టకుండా ఈరోజు పివిఆర్ ఐనాక్స్ థియేటర్ల నుంచి తప్పించారు. అయితే ఈ చర్య వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు సిని నిర్మాతల మండలి (తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ) ఆధ్వర్యంలో ఈ మేరకు ఒక మీటింగ్ జరుగుతోంది. గతంలో కూడా పలుసార్లు ఈ నేషనల్ థియేటర్ చైన్స్ ఇలాగే వ్యవహరించాయని మరోసారి ఇలా జరగకుండా ఏం చేయాలి అనే విషయం మీద మీటింగ్ జరపబోతున్నారని తెలుస్తోంది.
Also Read; Samantha: సూట్ విప్పేసిన సమంత.. షేక్ అవుతున్న ఇంటర్నెట్!
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి… ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. నిజానికి ఈరోజు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన చోటేమియాన్ బడే మియాన్ సినిమా రిలీజ్ అవుతోంది. ఆ సినిమా కోసం మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ ని పివిఆర్, ఐనాక్స్ సంస్థల ధియేటర్ల నుంచి తొలగించినట్లుగా ప్రచారంజరిగింది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?