Manjummal Boys: ఇండస్ట్రీ హిట్ సినిమాకి పివిఆర్ ఐనాక్స్ షాక్.. ఎమర్జెన్సీ మీటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మలయాళ చిత్రసీమ మొత్తాన్ని షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాని తెలుగులో వారం రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఏప్రిల్ ఆరవ తేదీన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, సినిమా నిర్మాణ సంస్థ పరవ ఫిలింస్ తో కలిసి తెలుగులో రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాని చెప్పా పెట్టకుండా ఈరోజు పివిఆర్ ఐనాక్స్ థియేటర్ల నుంచి తప్పించారు. అయితే ఈ చర్య వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు సిని నిర్మాతల మండలి (తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ) ఆధ్వర్యంలో ఈ మేరకు ఒక మీటింగ్ జరుగుతోంది. గతంలో కూడా పలుసార్లు ఈ నేషనల్ థియేటర్ చైన్స్ ఇలాగే వ్యవహరించాయని మరోసారి ఇలా జరగకుండా ఏం చేయాలి అనే విషయం మీద మీటింగ్ జరపబోతున్నారని తెలుస్తోంది.
Also Read; Samantha: సూట్ విప్పేసిన సమంత.. షేక్ అవుతున్న ఇంటర్నెట్!
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి… ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. నిజానికి ఈరోజు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన చోటేమియాన్ బడే మియాన్ సినిమా రిలీజ్ అవుతోంది. ఆ సినిమా కోసం మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ ని పివిఆర్, ఐనాక్స్ సంస్థల ధియేటర్ల నుంచి తొలగించినట్లుగా ప్రచారంజరిగింది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!