Puri Jagannadh: బ్రేకింగ్.. పూరిని బ్లాక్ మెయిల్ చేసిన బయ్యర్స్.. ఆడియో లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవలే లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పూరి జగన్నాథ్ తో పాటు బయ్యర్స్ కూడా కొన్ని కోట్లు నష్టపోయారు. అయితే సినిమా నష్టపోవడంతో తమ పరిస్థితి ఏంటి అని బయ్యర్స్ అడగడంతో అందరికి నష్టపరిహారం ఇస్తామని పూరి చెప్పుకొచ్చాడు. ఎంతో కొంత అడ్జస్ట్ చేస్తానని చెప్పడంతో కొన్నిరోజులు బయ్యర్స్ ఓపిక పట్టారు. కానీ, ఇంకా పూరి నుంచి డబ్బులు రాలేదని బయ్యర్స్ అందరూ కలిసి ధర్నా చేస్తామని పూరిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయమై పూరి మాట్లాడిన ఆడియో లీక్ ఆయ్యింది.
” ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయర్స్ తో మాట్లాడ్డం జరిగింది. ఒక నెలలో అగ్రీ ఐన అమౌంట్ ఇస్తా అని చెప్పను. ఇస్తాను అని చెప్పాక కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ది కాదు. ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడతాయి. కొన్ని పోతాయి. ఒకసారి సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గరనుంచి డబ్బు తీసుకోవడానికి మేము తిరగలి. పోకిరి దగ్గరనుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో వుంది. బయర్స్ అసోసియేషన్ నాకు ఆ అమౌంట్ వసూలు చేసి పెడతారా? ధర్నా చేస్తాం అంటున్నారు. చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకోని, వాళ్ళకి తప్ప మిగతావాళ్ళకి ఇస్తా” అంటూ పూరి కోపంతో మాట్లాడిన ఈ ఆడియో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మరి ఈ విషయమై సినీ పెద్దలు ఏమంటారో చూడాలి.
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో 'రష్మిక మందన్న'
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!