Varsham : ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన వర్షం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వర్షం సినిమాను మే 23న 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శోభన్ డైరెక్ట్ చేశారు. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కు మొదటి హిట్ ఇచ్చింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి భారీ హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ కు ఈ మూవీ ఆ లోపం తీర్చేసింది. ప్రభాస్ కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇందులో విలన్ గా గోపీచంద్ అద్భుతంగా నటించాడు. వీరిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీన్ అందరినీ ఆకట్టుకుంది.
Read Also : Manchu Vishnu : మంచు విష్ణు’ని హర్ట్ చేసిన శ్రీవిష్ణు
ఈ సినిమాతోనే ప్రభాస్ యూత్ కు ఫేవరెట్ అయిపోయాడు. ఈ సినిమా అప్పట్లో ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పేసింది. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఈ మూవీతోనే పెరిగింది. ఈ మూవీ టీవీల్లో వస్తే ఇప్పటికీ చూస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. బాహుబలి సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షం సినిమా రాబోతోంది. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమాలు వచ్చే లోపు దీన్ని రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ తెలుపుతున్నారు.
Read Also : NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్