Posani krishnamurali: నంది అవార్డులపై పోసాని కీలక ప్రకటన.. ఉత్తములు, అర్హులకు ఇస్తాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishnamurali Announcement on Nandi Awards: ఏపీ సచివాలయంలో ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. నిజాయితీగా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ చేయమని ముఖ్యమంత్రి నాకు చెప్పారని పేర్కొన్న ఆయన డ్రామా, టీవీ, సినిమా ఈ మూడు రంగాలకు ఒకేసారి సాధ్యం కాదని చెప్పానని అన్నారు. ఇక ఈ క్రమంలో పద్య నాటకాలకు ఊపిరి పోయాల్సిన అవసరం ఉందని, అందుకే ముందు నాటక రంగానికి నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు.
Sreemukhi: ఓ మైగాడ్ అనిపిస్తున్న శ్రీముఖి అందాలు.. పొట్టి గౌనులో అంతా కనిపించేలా?
Also Read
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
- Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ నంది అవార్డులు అంటేనే భయం వేస్తోందని, నేను నంది తీసుకుంటే..కమ్మనైనది అవుద్ది అని చెప్పా, ఒక్కొక్కరికి రెండు, మూడు ఇచ్చారని అన్నారు. గతంలో అంబికా కృష్ణని చంద్రబాబు తిట్టారు, అంబికా కృష్ణ తనకి స్వేచ్ఛ ఇవ్వలేదని చంద్రబాబుకి చెప్పేశాడని అన్నారు. మేము నంది అవార్డులను ఉత్తములు, అర్హులకు ఇస్తాం, రాష్ట్రంలో ఎవ్వరు షూటింగ్ లు చేసినా ఉచితంగా చేసుకోవచ్చని, స్టూడియోలు కడితే సహకరిస్తాం అని సీఎం జగన్ చెప్పారని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కూడా సహకారం కోసం మాట్లాడుతానన్న ఆయన రూల్ ప్రకారం, జీవోల ప్రకారం కొన్ని పనులు చేయలేమని, కొన్ని ప్రాక్టికాలిటీతో అవుతాయని అన్నారు.
ఇక ఈ క్రమంలోనే ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నాటక రంగానికి నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఉంటుందని అన్నారు. ఉప సంహరణకు నెల రోజుల గడువు ఇస్తున్నామన్న ఆయన ఐదు క్యాటగిరీల్లో పోటీలు ఉంటాయని అన్నారు. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు, యువ నాటికలు అన్నీ కలిపి మొత్తం 73 అవార్డులు ఉంటాయని, ప్రాధమికంగా ఎంపిక ప్రక్రియకు నెల రోజుల సమయం పడుతుందని అన్నారు. ప్రాథమిక స్క్రూటినీ లో ఎంపిక అయిన నాటకాలను నిర్దేశిత ప్రాంతంలో ప్రదర్శన చేయాల్సి ఉంటుందని, వారం రోజుల పాటు ఫైనల్ పోటీలు జరుగుతాయని అన్నారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!