Pindam: సినిమా మొదలుపెట్టగానే.. అమ్మ చనిపోయింది.. వింత సంఘటనలు.. ప్యాంట్ తడవడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pindam: హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం పిండం. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి కానుకగా చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి సినిమా ఎలా ఉండబోతుంది, చిత్రీకరణ ఎలా సాగింది అని వివరించడం ఆకట్టుకుంది. వీడియోలో మేకింగ్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూపించారు. ట్రైలర్ తోనే ఈ సినిమా ఎంత భయపెడుతుందో చూచాయగా చెప్పేశారు. పిండం అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్ప్లే ఈ చిత్రానికి హైలైట్గా నిలవనుంది.
ఇక పిండం ప్రెస్ మీట్ లో హీరో శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “పిండం అనేది స్ట్రయిట్, క్లియర్, సీరియస్ హారర్ జానర్. మామూలుగా కొన్ని హారర్ సినిమాల్లో సాంగ్స్, కామెడీ ట్రాక్ లు ఉంటాయి. అలాంటివేం లేకుండా మిమ్మల్ని భయపెట్టడం కోసం తీసిన స్ట్రయిట్ హారర్ ఫిల్మ్ ఇది. థియేటర్లలో మీకు ఖచ్చితంగా ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
ఇక దర్శకుడు సాయికిరణ్ దైదా మాట్లాడుతూ.. “ఒక నిజ జీవిత ఘటనను తీసుకొని నేను, నా సహ రచయిత కవి సిద్ధార్థ గారు కలిసి అద్భుతమైన కథగా మలిచాము. నేను దెయ్యాలు గురించి చెప్తే భయపడే మనిషిని కాదు కానీ, ఈ కథ నన్ను కొంచెం భయపెట్టింది. చిత్రీకరణ సమయంలో మాకు కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి. సినిమా కోసం ఒక పాపను ఎంపిక చేస్తే వాళ్ళ అమ్మ చనిపోవడం, లైట్ మ్యాన్ కింద పడటం సహా పలు సంఘటనలు జరిగాయి. అవన్నీ గుర్తొచ్చి ఒక్కోసారి రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు. ఒకసారి అమావాస్య అని తెలియకుండా అర్ధరాత్రి షూట్ ప్లాన్ చేశాం. షూట్ చేస్తుండగా అమావాస్య అని తెలిసి, అప్పటివరకు జరిగిన ఘటనల దృష్ట్యా అందరం బొట్లు పెట్టుకొని షూట్ చేశాం. ఈ సినిమాలో ఉన్నన్ని హారర్ బ్లాక్స్ మరే సినిమాలో ఉండవు. ఖచ్చితంగా భయపడతారు. ఒక్కరే కూర్చొని ఈ సినిమా చూడలేరు” అని చెప్పుకురావడమే కాకుండా ప్యాంట్ తడవడం ఖాయం అని నమ్మకంగా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..