పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరోవైపు సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు మోహన్ రాజా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా రాబోతుందంటూ వినిపించిన వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 2022లో వచ్చిన మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న మోహన్ రాజా, పవన్ను సరికొత్తగా చూపించబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే, ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.
Also Read: Fauji: నో డౌట్స్.. గట్టిగా ఫిక్స్ అయ్యారు!
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్-మోహన్ రాజా కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ మోహన్ రాజాకు అడ్వాన్స్ ఇచ్చిందనే టాక్ తప్పితే.. పవర్ స్టార్తో సినిమా గురించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టమైంది. పవన్ నెక్స్ట్ లైనప్లో ఉన్న సినిమాల్లో ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్తో పాటు హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా ఉంది. అలాగే.. సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నారు. నెక్స్ట్ పవన్ నుంచి ఇమ్మీడియేట్గా సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా సురేందర్ రెడ్డిదే. ఓజీ, వీరమల్లు సీక్వెల్స్ ఎప్పుడు ఉంటాయనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే.. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read: Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!