Pan India: ఇక ఇప్పుడు అందరి చూపు ‘విరూపాక్ష’ మీదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virupaksha: ఈ యేడాది తెలుగు నుండి దాదాపు పాతిక పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి. బాధాకరం ఏమంటే… అందులో ఇప్పటికే విడుదలైన సినిమాలేవీ ఉత్తరాదిన తమదైన ముద్రను వేయలేకపోయాయి. ‘బాహుబలి’ వేసిన బాటలో దక్షిణాదిలోని కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉత్తరాదిన జయకేతనం ఎగరేశాయి. అలానే ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ సైతం అఖండ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆస్కార్ విజేతగా విశ్వవేదికపై సగర్వంగా నిలిచింది. ఈ కారణంగా తెలుగు నుండి పాన్ ఇండియా మూవీ వస్తోందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం మొదలైంది. కానీ గత నెలలో వచ్చిన విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’, నాని ‘దసరా’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై నిరాశ కలిగించాయి. ‘ధమ్కీ’ మూవీ తెలుగులో కూడా పరాజయం కాగా, ‘దసరా’ ఇక్కడ ఫర్వాలేదనిపించింది. కానీ ఉత్తరాదిన ఈ రెండు సినిమాలూ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.
తాజాగా శుక్రవారం విడుదలైన సమంత ‘శాకుంతలం’ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని దర్శక నిర్మాతలు భావించారు. దానికి తగ్గట్టుగానే ప్రచారమూ చేశారు. కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాళిదాస విరచిత ‘అభిజ్ఞాన శాకుంతలం’ను దృశ్య కావ్యంగా మలచడంలో గుణశేఖర్ విఫలమయ్యాడని అంటున్నారు. అంతేకాకుండా నిర్మాత నీలిమా గుణ, సమర్పకుడు ‘దిల్’ రాజు ఏ ధైర్యంతో ‘శాకుంతలం’ ప్రీమియర్ షోస్ ను వేశారో అర్థమే కావడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను చూసిన వారంతా పెదవి విరుస్తున్న నేపథ్యంలో, ఫస్ట్ వీకండ్ లో ఏ మాత్రం వసూళ్ళు వస్తాయన్నది చూడాల్సిందే! ఏది ఏమైనా ‘ధమ్కీ’, ‘దసరా’, ‘శాకుంతలం’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయాయన్నది వాస్తవం. గమనించాల్సిన విషయం ఏమంటే… తెలుగు నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాలే కాదు… దక్షిణాది నుండి వచ్చిన ఉపేంద్ర ‘కబ్జా’, సందీప్ కిషన్ ‘మైఖేల్’, కొరియోగ్రాఫర్ బృంద రూపొందించిన ‘థగ్స్’ మూవీలది కూడా ఇదే పరిస్థితి.
Also Read
- Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
- CM Vijay: IMDb లిస్ట్ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి 'దళపతి'! అసలేం జరిగిందంటే..
- Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
- iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
ఇలాంటి టైమ్ లో ఈ నెల 21న రాబోతున్న తెలుగు పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’పైనే అందరి దృష్టీ ఉంది. సాయి ధరమ్ తేజ నటించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ కథలో కొంతలో కొంతైనా కొత్తదనం ఉంటే ఓకే కానీ లేదంటే ఉత్తరాది వారిని మెప్పించడం కష్టం. అదే జరిగితే… పాన్ ఇండియా ప్రభ తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉంది. పైగా దీని తర్వాత వారంలో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇక అదే వారంలో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ -2’ కూడా పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. అయితే… ఈ సినిమా మొదటి భాగం పెద్దంత మెప్పించలేదు. సో… సహజంగానే దీని మీద ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఏదేమైనా… దక్షిణాది నుండి విడుదల అవుతున్న పాన్ ఇండియా మూవీస్ పై నీలినీడలు అలముకున్నట్టే!
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!