Nitya Menon: తెలుగువారి మది దోచిన నిత్య మీనన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది.
1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే నిత్య మీనన్ బాల్యంలోనే ‘ద మంకీ హూ న్యూ టూ మచ్’ అనే ఆంగ్ల చిత్రంలో ప్రముఖ నటి టబుకు చెల్లెలుగా నటించింది. కన్నడ, మళయాళ భాషల్లో నటిస్తున్న సమయంలోనే ఆమె నటనను చూసి మురిసిపోయింది దర్శకురాలు నందినీ రెడ్డి. తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’తోనే నిత్య మీనన్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది నందినీ రెడ్డి. ఆ తరువాత నుంచీ తన టాలెంట్ తో తెలుగువారిని ఇట్టే కట్టి పడేసింది నిత్య.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
‘అలా మొదలైంది’ చిత్రంలోనే నిత్య మీనన్ రెండు పాటలు పాడేసి, అబ్బుర పరచింది. కళ్యాణీ మాలిక్ స్వరకల్పనలో “ఏదో అనుకుంటే…”, “అమ్మమ్మో అమ్మో…” అంటూ సాగే పాటలను పాడి నిత్య గాయనిగానూ పరవశింప చేసింది. ముద్దుగా బొద్దుగా ఉంటూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో నిత్య తెలుగువారికి దగ్గరయింది. హీరో నానికి ‘అలా మొదలైంది’తో కలసి వచ్చింది నిత్య మీనన్. ఇక సక్సెస్ కోసం చెకోర పక్షిలా హీరో నితిన్ ఎదురు చూస్తున్న సమయంలో ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాల్లో నటించి, అతనికి విజయనాయికగా మారింది నిత్య. అంతేనా, ఆ రెండు సినిమాల్లోనూ గాయనిగా అలరించింది. ‘ఇష్క్’లో నిత్య నోట పలికిన “ప్రియా ప్రియా…” పాట ఇప్పటికీ కుర్రకారును కవ్విస్తూనే ఉంది. ఇక “తూ హీ రే…” అంటూ పాట పాడి ‘గుండె జారి గల్లంతయ్యిందే’లోనూ మురిపించింది. తాను నటించిన ’24’, ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్’, ‘మాలిని 22’ వంటి డబ్బింగ్ చిత్రాలలోనూ తెలుగు పాటలు పాడి అలరించింది నిత్య మీనన్. ఇప్పటికీ తన దరికి చేరిన తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తూనే ఉంది నిత్య. ‘స్కైలాబ్’ తెలుగు చిత్ర నిర్మాణంలో నిత్య మీనన్ పాలు పంచుకుంది. ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమం న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారామె. మునుముందు తెలుగుతో మరెంతగా అనుబంధం పెంచుకుంటుందో నిత్య మీనన్!
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?