Nitya Menon: తెలుగువారి మది దోచిన నిత్య మీనన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది.
1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే నిత్య మీనన్ బాల్యంలోనే ‘ద మంకీ హూ న్యూ టూ మచ్’ అనే ఆంగ్ల చిత్రంలో ప్రముఖ నటి టబుకు చెల్లెలుగా నటించింది. కన్నడ, మళయాళ భాషల్లో నటిస్తున్న సమయంలోనే ఆమె నటనను చూసి మురిసిపోయింది దర్శకురాలు నందినీ రెడ్డి. తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’తోనే నిత్య మీనన్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది నందినీ రెడ్డి. ఆ తరువాత నుంచీ తన టాలెంట్ తో తెలుగువారిని ఇట్టే కట్టి పడేసింది నిత్య.
Also Read
- Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
‘అలా మొదలైంది’ చిత్రంలోనే నిత్య మీనన్ రెండు పాటలు పాడేసి, అబ్బుర పరచింది. కళ్యాణీ మాలిక్ స్వరకల్పనలో “ఏదో అనుకుంటే…”, “అమ్మమ్మో అమ్మో…” అంటూ సాగే పాటలను పాడి నిత్య గాయనిగానూ పరవశింప చేసింది. ముద్దుగా బొద్దుగా ఉంటూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో నిత్య తెలుగువారికి దగ్గరయింది. హీరో నానికి ‘అలా మొదలైంది’తో కలసి వచ్చింది నిత్య మీనన్. ఇక సక్సెస్ కోసం చెకోర పక్షిలా హీరో నితిన్ ఎదురు చూస్తున్న సమయంలో ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాల్లో నటించి, అతనికి విజయనాయికగా మారింది నిత్య. అంతేనా, ఆ రెండు సినిమాల్లోనూ గాయనిగా అలరించింది. ‘ఇష్క్’లో నిత్య నోట పలికిన “ప్రియా ప్రియా…” పాట ఇప్పటికీ కుర్రకారును కవ్విస్తూనే ఉంది. ఇక “తూ హీ రే…” అంటూ పాట పాడి ‘గుండె జారి గల్లంతయ్యిందే’లోనూ మురిపించింది. తాను నటించిన ’24’, ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్’, ‘మాలిని 22’ వంటి డబ్బింగ్ చిత్రాలలోనూ తెలుగు పాటలు పాడి అలరించింది నిత్య మీనన్. ఇప్పటికీ తన దరికి చేరిన తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తూనే ఉంది నిత్య. ‘స్కైలాబ్’ తెలుగు చిత్ర నిర్మాణంలో నిత్య మీనన్ పాలు పంచుకుంది. ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమం న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారామె. మునుముందు తెలుగుతో మరెంతగా అనుబంధం పెంచుకుంటుందో నిత్య మీనన్!
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!