Nitya Menon: తెలుగువారి మది దోచిన నిత్య మీనన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది.
1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే నిత్య మీనన్ బాల్యంలోనే ‘ద మంకీ హూ న్యూ టూ మచ్’ అనే ఆంగ్ల చిత్రంలో ప్రముఖ నటి టబుకు చెల్లెలుగా నటించింది. కన్నడ, మళయాళ భాషల్లో నటిస్తున్న సమయంలోనే ఆమె నటనను చూసి మురిసిపోయింది దర్శకురాలు నందినీ రెడ్డి. తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’తోనే నిత్య మీనన్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది నందినీ రెడ్డి. ఆ తరువాత నుంచీ తన టాలెంట్ తో తెలుగువారిని ఇట్టే కట్టి పడేసింది నిత్య.
Also Read
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
‘అలా మొదలైంది’ చిత్రంలోనే నిత్య మీనన్ రెండు పాటలు పాడేసి, అబ్బుర పరచింది. కళ్యాణీ మాలిక్ స్వరకల్పనలో “ఏదో అనుకుంటే…”, “అమ్మమ్మో అమ్మో…” అంటూ సాగే పాటలను పాడి నిత్య గాయనిగానూ పరవశింప చేసింది. ముద్దుగా బొద్దుగా ఉంటూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో నిత్య తెలుగువారికి దగ్గరయింది. హీరో నానికి ‘అలా మొదలైంది’తో కలసి వచ్చింది నిత్య మీనన్. ఇక సక్సెస్ కోసం చెకోర పక్షిలా హీరో నితిన్ ఎదురు చూస్తున్న సమయంలో ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాల్లో నటించి, అతనికి విజయనాయికగా మారింది నిత్య. అంతేనా, ఆ రెండు సినిమాల్లోనూ గాయనిగా అలరించింది. ‘ఇష్క్’లో నిత్య నోట పలికిన “ప్రియా ప్రియా…” పాట ఇప్పటికీ కుర్రకారును కవ్విస్తూనే ఉంది. ఇక “తూ హీ రే…” అంటూ పాట పాడి ‘గుండె జారి గల్లంతయ్యిందే’లోనూ మురిపించింది. తాను నటించిన ’24’, ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్’, ‘మాలిని 22’ వంటి డబ్బింగ్ చిత్రాలలోనూ తెలుగు పాటలు పాడి అలరించింది నిత్య మీనన్. ఇప్పటికీ తన దరికి చేరిన తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తూనే ఉంది నిత్య. ‘స్కైలాబ్’ తెలుగు చిత్ర నిర్మాణంలో నిత్య మీనన్ పాలు పంచుకుంది. ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమం న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారామె. మునుముందు తెలుగుతో మరెంతగా అనుబంధం పెంచుకుంటుందో నిత్య మీనన్!
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!