Nagarjuna Movie with Ajay Bhupathi to be Announced Soon: ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన నాగార్జునకు ఇప్పుడు ఏమైంది? అప్పుడెప్పుడో ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమా అధికారికంగా ప్రకటించ లేదు. ఒకపక్క ఆయన ఏజ్ ఉన్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ వరుస సినిమాలను ప్రకటిస్తూ రిలీజ్ లు కూడా చేస్తున్నారు. కానీ, నాగార్జున ఎందుకో సైలెంట్ అయ్యాడు. ఘోస్ట్ డిజాస్టర్ తరువాత లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న నాగ్ ఒక మలయాళం సినిమాను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత రచయిత బెజవాడ ప్రసన్నను డైరెక్టర్ గా చేసే బాధ్యత నాగ్ తీసుకున్నాడని అది కూడా ఆ మలయాళ రీమేక్ సినిమాతోనే అని ప్రచారం కూడా జరిగింది.
Mega Princess: పాప జాతకం అధ్బుతం.. మనవరాలిపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అయితే అది నిజం కాదని ప్రసన్నకుమార్ నాగ్ కోసం ఒక కథ రెడీ చేశారని కూడా అన్నారు కానీ అది కూడా క్లారిటీ లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు నాగార్జున అక్కినేని RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని కస్టడీ మేకర్ శ్రీనివాస చిట్టూరి మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే RX 100 సినిమాతో హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ తరువాత శర్వానంద్ సిద్దార్థ్ లతో మహా సముద్రం అనే ఒక మల్టీస్టారర్ చేయగా అది డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆయన పాయల్ రాజ్ పుత్ ను పెట్టి మంగళవారం అనే సినిమా చేస్తున్నారు. చివరిగా డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.