Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: ఆదిపురుష్.. ప్రభాస్.. జై శ్రీరామ్.. ఓం రౌత్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ పేర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి నుంచి ఒక నెగెటివ్ వైబ్ తో, వివాదాల మధ్య నలుగుతున్న ఆదిపురుష్ కు ట్రైలర్ రిలీజ్ తో కొద్దిగా పాజిటివిటీ పెరిగింది. ఇక ఆ పాజిటివీటినే మేకర్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక జూన్ 5 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ప్లాన్ చేసి మరింత మెప్పించారు. ఈ వెంత్ కు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండగా.. పలువురు రాజకీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్- అతుల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయిన దగ్గరనుంచి టాలీవుడ్ మొత్తం.. అతుల్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు. జై శ్రీరామ్, రామ్ సీతారామ్ సాంగ్స్ కు అజయ్- అతుల్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతమని ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే.
Raashi Khanna: అద్దం ముందు అమ్మడి ఎద అందాల ఆరబోత.. హీటెక్కిస్తోందే
Also Read
- Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
- Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్కు షాక్.. 'పెద్ది'కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
- Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ 'వెంకట్రామయ్య గారి తాలూకా'.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
- Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
ఇక తాజాగా అజయ్- అతుల్.. ఈ సినిమా ప్రమోషన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్ వేశారు. జూన్ 4 న తిరుపతిలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బైక్ పై వస్తున్నట్టు ప్రకటించారు. అంటే తిరుపతి వచ్చాకా ఈవెంట్ కు బైక్ పై రావడం కాదు.. ముంబై నుంచి తిరుపతికి బైక్ ర్యాలీగా వస్తున్నార ట. జూన్ 3 న .. అంటే ఈరోజు ముంబైలో బైక్ పై బయల్దేరి.. రోడ్డు మ్యాప్ ద్వారా తిరుపతి చేరుకోనున్నారు. ఇక తిరుపతి చేరుకోగానే..తన సోదరుడు అజయ్తో కలిసి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లార్డ్ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జై శ్రీరామ్ సాంగ్ ను లైవ్ ఇవ్వనున్నారు. ఇదే ఆయన దేవుడికి ఇస్తున్న కానుక అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఫీట్ ఎవరు చేయలేదని, ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త విన్నాకా తెలుగు ప్రేక్షకులు సైతం ఎక్కేశావయ్యా .. ప్రేక్షకుల గుండెల్లో ఒక మెట్టు ఎక్కేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!