Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: ఆదిపురుష్.. ప్రభాస్.. జై శ్రీరామ్.. ఓం రౌత్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ పేర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి నుంచి ఒక నెగెటివ్ వైబ్ తో, వివాదాల మధ్య నలుగుతున్న ఆదిపురుష్ కు ట్రైలర్ రిలీజ్ తో కొద్దిగా పాజిటివిటీ పెరిగింది. ఇక ఆ పాజిటివీటినే మేకర్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక జూన్ 5 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ప్లాన్ చేసి మరింత మెప్పించారు. ఈ వెంత్ కు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండగా.. పలువురు రాజకీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్- అతుల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయిన దగ్గరనుంచి టాలీవుడ్ మొత్తం.. అతుల్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు. జై శ్రీరామ్, రామ్ సీతారామ్ సాంగ్స్ కు అజయ్- అతుల్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతమని ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే.
Raashi Khanna: అద్దం ముందు అమ్మడి ఎద అందాల ఆరబోత.. హీటెక్కిస్తోందే
Also Read
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ఇక తాజాగా అజయ్- అతుల్.. ఈ సినిమా ప్రమోషన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్ వేశారు. జూన్ 4 న తిరుపతిలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బైక్ పై వస్తున్నట్టు ప్రకటించారు. అంటే తిరుపతి వచ్చాకా ఈవెంట్ కు బైక్ పై రావడం కాదు.. ముంబై నుంచి తిరుపతికి బైక్ ర్యాలీగా వస్తున్నార ట. జూన్ 3 న .. అంటే ఈరోజు ముంబైలో బైక్ పై బయల్దేరి.. రోడ్డు మ్యాప్ ద్వారా తిరుపతి చేరుకోనున్నారు. ఇక తిరుపతి చేరుకోగానే..తన సోదరుడు అజయ్తో కలిసి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లార్డ్ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జై శ్రీరామ్ సాంగ్ ను లైవ్ ఇవ్వనున్నారు. ఇదే ఆయన దేవుడికి ఇస్తున్న కానుక అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఫీట్ ఎవరు చేయలేదని, ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త విన్నాకా తెలుగు ప్రేక్షకులు సైతం ఎక్కేశావయ్యా .. ప్రేక్షకుల గుండెల్లో ఒక మెట్టు ఎక్కేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..