Mohan Babu: ఇళయరాజాను పరామర్శించిన మోహన్ బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భవతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఇక కూతురు మరణాన్ని తట్టుకోలేక మ్యూజిక్ మ్యాస్ట్రో కొన్నిరోజులు తన ప్రాజెక్ట్స్ మొత్తాన్ని స్టాప్ చేశారు. ఇక ఇళయరాజాను పరామర్శించడానికి తెలుగు, తమిళ్ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్తున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు.. భార్యతో సహా ఇళయరాజా ఇంటికి వెళ్లి.. ఆయనను పరామర్శించారు. ఇక ఈ ఫోటోలను మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
“హృదయ విదారక వార్త విన్న వెంటనే నేను ఇళయరాజాని పరామర్శించాను. కుమార్తె భవతరిణి మరణంతో విషాదంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద క్షణాన్ని తట్టుకునే శక్తిని కుటుంబానికి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మోహన్ బాబు – ఇళయరాజా మంచి స్నేహితులు. మంచు లక్ష్మీ నటించిన గుండెల్లో గోదారి సినిమాకు ఇళయరాజానే మ్యూజిక్ అందించారు. అందులో ఎంతో ఫేమస్ అయిన నను నీతో సాంగ్ పాడింది భవతారిణినే. మొదటి నుంచి కూడా మోహన్ బాబు- ఇళయరాజా మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక భవతారిణి కూడా మోహన్ బాబు కుటుంబంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది.
Also Read
Upon hearing the heartbreaking news, I visited @ilaiyaraaja garu to convey my deepest condolences to him and his family on the tragic loss of his daughter Bhavatharini.
I pray that the almighty gives his family the strength to withstand this tragic moment. pic.twitter.com/3DxTCyYEE5
— Mohan Babu M (@themohanbabu) January 30, 2024
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..