అది సంస్కారం అంటే… బాలయ్యపై మోహన్ బాబు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికలు, వాటి తదనంతర ఫలితాలు, కొత్త ప్యానెల్ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఓడిపోయిన ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం మరియు ఇతరులు రాజీనామా చేయడం తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య మంచు విష్ణు తన తండ్రితో కలిసి వెళ్ళి నందమూరి బాలకృష్ణను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘మా’ ఫలితాల తరువాత తొలిసారిగా బాలకృష్ణను కలిశారు మంచు తండ్రీకొడుకులు. ఎన్నికలకు ముందు బాలకృష్ణ మంచు విష్ణుకే తాను సపోర్ట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చెప్పినట్టుగానే మంచు విష్ణుకే ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు విష్ణు, మోహన్ బాబు… బాలయ్యను కలిశారు.
Read Also : “మహా సముద్రం” మూవీ ట్విట్టర్ రివ్యూ !
Also Read
- Drishyam 3 Hindi Version : 'దృశ్యం 3' హిందీ వెర్షన్ లో భారీ మార్పులు... రీజన్ ఇదేనా ?
- Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి... చేసేదంతా దర్శకులే... 'పెద్ది' వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
- NTRNEEL : ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
- Samantha Ruth Prabhu : 'మా ఇంటి బంగారం' హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ “అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. గెలుపుకు సహకరించిన అందరినీ కలుస్తాను. ఇప్పటికే కోట శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్ ను కలిశాను. ప్రకాష్ రాజ్ ప్యానల్ ను కలుపుకునే వెళ్తా. రాజీనామాల విషయానికొస్తే మీటింగ్ పెట్టి ఈసీ మెంబర్ల అభిప్రాయం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటాను. చిరంజీవిని కూడా కలుస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాలయ్యతో ఉన్న ఫోటోను షేర్ చేసిన మంచు విష్ణు “నాకు సపోర్ట్ చేసిన బాల అన్నకు ధన్యవాదాలు. కలుసుకుని నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఆయన కూడా ‘మా’ కోసం ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటానని హామీ ఇచ్చారు. ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చడంపై దృష్టి పెట్టమని నాకు సలహా ఇచ్చాడు. ఇదే ప్రస్తుతం నా ఎజెండా” అంటూ ట్వీట్ చేశారు.
Thank you to Bala anna for his support. Met and expressed my gratitude. He also assured that he will always be there for MAA and advised me to concentrate on bringing the MAA family together; which is my agenda right now. 💪🏽❤️🙏 pic.twitter.com/eFpGr8Nqvx
— Vishnu Manchu (@iVishnuManchu) October 14, 2021
మోహన్ బాబు మాట్లాడుతూ “షిర్డీ సాయి, కనక దుర్గ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. ఇప్పుడు బాలయ్య ఇంటికి ఎందుకు వచ్చానంటే ఆయన ఓటు వేశారని కాదు, సంస్కారం కోసం. గత ఎన్నికల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి ప్రచారం చేశాను. మంగళగిరిలో టీడీపీ ఓడిపోయింది. అయినా కూడా అన్నీ మర్చిపోయి, నేను ఫోన్ చేసి కలుద్దాం అనగానే ఓకే చెప్పారు బాలయ్య. అది సంస్కారం అంటే…” అంటూ మంచు విష్ణుకు సపోర్ట్ చేసినందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!