అది సంస్కారం అంటే… బాలయ్యపై మోహన్ బాబు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికలు, వాటి తదనంతర ఫలితాలు, కొత్త ప్యానెల్ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఓడిపోయిన ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం మరియు ఇతరులు రాజీనామా చేయడం తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య మంచు విష్ణు తన తండ్రితో కలిసి వెళ్ళి నందమూరి బాలకృష్ణను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘మా’ ఫలితాల తరువాత తొలిసారిగా బాలకృష్ణను కలిశారు మంచు తండ్రీకొడుకులు. ఎన్నికలకు ముందు బాలకృష్ణ మంచు విష్ణుకే తాను సపోర్ట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చెప్పినట్టుగానే మంచు విష్ణుకే ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు విష్ణు, మోహన్ బాబు… బాలయ్యను కలిశారు.
Read Also : “మహా సముద్రం” మూవీ ట్విట్టర్ రివ్యూ !
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ “అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. గెలుపుకు సహకరించిన అందరినీ కలుస్తాను. ఇప్పటికే కోట శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్ ను కలిశాను. ప్రకాష్ రాజ్ ప్యానల్ ను కలుపుకునే వెళ్తా. రాజీనామాల విషయానికొస్తే మీటింగ్ పెట్టి ఈసీ మెంబర్ల అభిప్రాయం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటాను. చిరంజీవిని కూడా కలుస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాలయ్యతో ఉన్న ఫోటోను షేర్ చేసిన మంచు విష్ణు “నాకు సపోర్ట్ చేసిన బాల అన్నకు ధన్యవాదాలు. కలుసుకుని నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఆయన కూడా ‘మా’ కోసం ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటానని హామీ ఇచ్చారు. ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చడంపై దృష్టి పెట్టమని నాకు సలహా ఇచ్చాడు. ఇదే ప్రస్తుతం నా ఎజెండా” అంటూ ట్వీట్ చేశారు.
Thank you to Bala anna for his support. Met and expressed my gratitude. He also assured that he will always be there for MAA and advised me to concentrate on bringing the MAA family together; which is my agenda right now. 💪🏽❤️🙏 pic.twitter.com/eFpGr8Nqvx
— Vishnu Manchu (@iVishnuManchu) October 14, 2021
మోహన్ బాబు మాట్లాడుతూ “షిర్డీ సాయి, కనక దుర్గ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. ఇప్పుడు బాలయ్య ఇంటికి ఎందుకు వచ్చానంటే ఆయన ఓటు వేశారని కాదు, సంస్కారం కోసం. గత ఎన్నికల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి ప్రచారం చేశాను. మంగళగిరిలో టీడీపీ ఓడిపోయింది. అయినా కూడా అన్నీ మర్చిపోయి, నేను ఫోన్ చేసి కలుద్దాం అనగానే ఓకే చెప్పారు బాలయ్య. అది సంస్కారం అంటే…” అంటూ మంచు విష్ణుకు సపోర్ట్ చేసినందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!