అది సంస్కారం అంటే… బాలయ్యపై మోహన్ బాబు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికలు, వాటి తదనంతర ఫలితాలు, కొత్త ప్యానెల్ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఓడిపోయిన ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం మరియు ఇతరులు రాజీనామా చేయడం తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య మంచు విష్ణు తన తండ్రితో కలిసి వెళ్ళి నందమూరి బాలకృష్ణను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘మా’ ఫలితాల తరువాత తొలిసారిగా బాలకృష్ణను కలిశారు మంచు తండ్రీకొడుకులు. ఎన్నికలకు ముందు బాలకృష్ణ మంచు విష్ణుకే తాను సపోర్ట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చెప్పినట్టుగానే మంచు విష్ణుకే ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు విష్ణు, మోహన్ బాబు… బాలయ్యను కలిశారు.
Read Also : “మహా సముద్రం” మూవీ ట్విట్టర్ రివ్యూ !
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ “అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. గెలుపుకు సహకరించిన అందరినీ కలుస్తాను. ఇప్పటికే కోట శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్ ను కలిశాను. ప్రకాష్ రాజ్ ప్యానల్ ను కలుపుకునే వెళ్తా. రాజీనామాల విషయానికొస్తే మీటింగ్ పెట్టి ఈసీ మెంబర్ల అభిప్రాయం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటాను. చిరంజీవిని కూడా కలుస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాలయ్యతో ఉన్న ఫోటోను షేర్ చేసిన మంచు విష్ణు “నాకు సపోర్ట్ చేసిన బాల అన్నకు ధన్యవాదాలు. కలుసుకుని నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఆయన కూడా ‘మా’ కోసం ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటానని హామీ ఇచ్చారు. ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చడంపై దృష్టి పెట్టమని నాకు సలహా ఇచ్చాడు. ఇదే ప్రస్తుతం నా ఎజెండా” అంటూ ట్వీట్ చేశారు.
Thank you to Bala anna for his support. Met and expressed my gratitude. He also assured that he will always be there for MAA and advised me to concentrate on bringing the MAA family together; which is my agenda right now. 💪🏽❤️🙏 pic.twitter.com/eFpGr8Nqvx
— Vishnu Manchu (@iVishnuManchu) October 14, 2021
మోహన్ బాబు మాట్లాడుతూ “షిర్డీ సాయి, కనక దుర్గ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. ఇప్పుడు బాలయ్య ఇంటికి ఎందుకు వచ్చానంటే ఆయన ఓటు వేశారని కాదు, సంస్కారం కోసం. గత ఎన్నికల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి ప్రచారం చేశాను. మంగళగిరిలో టీడీపీ ఓడిపోయింది. అయినా కూడా అన్నీ మర్చిపోయి, నేను ఫోన్ చేసి కలుద్దాం అనగానే ఓకే చెప్పారు బాలయ్య. అది సంస్కారం అంటే…” అంటూ మంచు విష్ణుకు సపోర్ట్ చేసినందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..