Bhairavam : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. చాలా ఏళ్ల తర్వాత మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్ నుంచి వస్తున్న మూవీ. పైగా ఇందులో అందరి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మే 30న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయి. తాజాగా ఈ ముగ్గురూ కలిసి సుమ కనకాలతో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మూవీ విశేషాలను పంచుకున్నారు.
Read Also : Coolie : ‘కూలీ’ సినిమా తెలుగు రైట్స్ కొనేసిన నాగార్జున?
మనోజ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో మా అందరి కంటే నారా రోహిత్ యాక్షన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ సీన్లలో రోహిత్ అదిరిపోతాడు. మా సీన్ల కంటే అతనివే బాగుంటాయి. నాకు తెలిసి అతని కెరీర్ బెస్ట్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్, మనోజ్ నుంచి సినిమా వచ్చి ఏడేళ్లు దాటిపోతోంది. ఇన్నేళ్ల తర్వాత వీరి నుంచి ఈ మూవీ వస్తోంది.
అలాగే హిట్ కొట్టి అయితే ఎన్నో ఏళ్లు గడుస్తున్నాయి. కాబట్టి ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని వీరు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక మనోజ్ ఈ మూవీ ప్రమోషన్లలో చేస్తున్న కామెంట్లు చాలా వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా మనోజ్ కామెంట్లతోనే ఈ మూవీకి హైప్ వస్తోందని చెప్పుకోవాలి. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Read Also : India On Turkey: పాకిస్తాన్కి టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత్ కీలక సూచనలు..