Mamta Mohandas: దానికి లొంగిపోలేదంటూ.. మమతా స్ట్రాంగ్ కౌంటర్
Mamta Mohandas Gives Clarity On Rumours: నటి మమతా మోహన్దాస్ గుర్తుందా? ‘యమదొంగ’తో టాలీవుడ్కి పరిచయమైన ఈ బ్యూటీ, మొదట్లో కొన్నాళ్లు బాగానే సందడి చేసింది. అయితే.. ఆ తర్వాత క్యాన్సర్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న సమయంలో.. సోషల్ మీడియాలో ఆ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ, తన ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. సుదీర్ఘకాలం క్యాన్సర్తో పోరాడి, చివరికి గెలిచింది. క్యాన్సర్ నుంచి బయడపడ్డాక, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ, తన సెకండ్ ఇన్నింగ్స్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.
అయితే.. కొన్ని రోజుల నుంచి మమతా ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ఆ అమ్మడు మరోసారి క్యాన్సర్ బారిన పడిందని, రోజురోజుకీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని ప్రచారం జరుగుతోంది. మునుపటిలాగా క్యాన్సర్తో పోరాటే శక్తి లేకపోవడంతో.. ఆ వ్యాధికి మమతా లొంగిపోయిందని కూడా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మమతా ఈ వార్తలపై తాజాగా స్పందించింది. తాను మళ్లీ క్యాన్సర్ బారిన పడలేదని, చాలా ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేసింది. అంతేకాదు.. తాను తన పని చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని, క్లిక్కుల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాయకుండా మీరు కూడా మీ పని చేసుకుంటే బాగుంటుందని గాసిప్రాయుళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
‘‘నేను మళ్లీ క్యాన్సర్ బారిన పడినట్టు వస్తున్న ఫేక్ వార్తలు చూసి.. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. నాకు వాళ్ల దగ్గర నుంచి మెసేజెస్, మెయిల్స్ వస్తున్నాయి. నేను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో నేను మరోసారి క్యాన్సర్ బారిన పడ్డానని, ఈసారి ఫైట్ చేసే శక్తి లేక దానికి లొంగిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. నేను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ వార్తలను నమ్మకండి’’ అంటూ ఇన్స్టాలో మమతా క్లారిటీ ఇచ్చింది. అలాగే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పేందుకు తాజా ఫోటోలను సైతం ఇన్స్టాలో షేర్ చేసింది.
తనపై గతంలోనూ ఇలాంటి వార్తలు చాలా వచ్చాయని, ఇప్పుడు మరింత పెచ్చుమీరిపోయాయని, వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే తాను ఇలా స్పందించాల్సి వస్తోందని మమతా పేర్కొంది. ఇప్పుడు మీకు సమాధానం దొరికింది కాబట్టి, నా మీద తప్పుడు వార్తలు రాయడం మానేసి మీ పనులు చూసుకోండని గాసిప్స్ రాసే వారికి గట్టిగా సమాధానం ఇచ్చింది. తనలాగే కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, జీవితం విలువ ఏంటో అందరికీ తెలుస్తుందని హితవు పలికింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో