Manjummel Boys: హిట్ సినిమా నిర్మాతలు మోసం చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malyalam Hit Film Manjummel Boys Producers Accused Of Fraud In Profit Sharing: మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఈ ఏడాది విజయవంతమైన సినిమాలలో ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేసింది. తెలుగులో కూడా మంచి టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. వాస్తవానికి, చిత్ర పెట్టుబడిదారు తరపున నిర్మాతలపై చీటింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది. మీడియా నివేదికల ప్రకారం, మంగళవారం ఎర్నాకుళం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కేరళ పోలీసులను చిత్ర నిర్మాతతో పాటు పరవ ఫిల్మ్స్, వారి సహచరుడు షాన్ ఆంటోనీపై ఫిర్యాదు చేయాలని కోరింది. ఈ విషయం లాభాల పంపిణీకి చెందినదిగా చెబుతున్నారు. ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఈ సినిమాకు వచ్చిన లాభంలో 40 శాతం షేర్ చేయలేదని సినిమాకి ఫైనాన్స్ చేసిన వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో షాన్ ఆంటోనీని ఫైనాన్స్ చేసిన సిరాజ్ వలియతార హమీద్ ప్రధాన నిందితుడిగా చేర్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాలను పంచుకుంటామని నిర్మాతలు హామీ ఇచ్చారని, అయితే అది నెరవేర్చలేదని హమీద్ ఆరోపించారు.
Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..
Also Read
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
- Ntv Exclusive: 'పెద్ది'తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
- PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ఈ కేసులో షాన్ ఆంటోనీని కేరళ పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. అదే సమయంలో, ఫిర్యాదు తర్వాత, సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలో పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టిన డబ్బులు వెనక్కి చేసిన తర్వాత 40 శాతం వచ్చే లాభాల వాటాన్ని కూడా ఇస్తామని తమకు అగ్రిమెంట్ చేసినట్లు ఫైనాన్షియల్ చెబుతున్నారు. ఈ క్రమంలో హమీద్ పరవ ఫిల్మ్స్ ఖాతాకు రూ.5.99 కోట్లు, షాన్ ఆంటోనీ ఖాతాకు రూ.50 లక్షలు పంపాడు. దీని తర్వాత కూడా హమీద్ మరో రూ.51 లక్షలు అప్పుగా ఇచ్చారు. నిర్మాతలు అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు అలాగే లాభాలను కూడా షేర్ చేయలేదు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రం. వెకేషన్లో ఉన్నప్పుడు గుహలో చిక్కుకున్న స్నేహితుల టీం కథే ఈ చిత్రం. ఇది ఫిబ్రవరి 22, 2024న విడుదలైంది. సకల్నిక్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.234.25 కోట్లు రాబట్టింది.
తాజావార్తలు
-
Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!