Manjummel Boys: హిట్ సినిమా నిర్మాతలు మోసం చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malyalam Hit Film Manjummel Boys Producers Accused Of Fraud In Profit Sharing: మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఈ ఏడాది విజయవంతమైన సినిమాలలో ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేసింది. తెలుగులో కూడా మంచి టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. వాస్తవానికి, చిత్ర పెట్టుబడిదారు తరపున నిర్మాతలపై చీటింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది. మీడియా నివేదికల ప్రకారం, మంగళవారం ఎర్నాకుళం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కేరళ పోలీసులను చిత్ర నిర్మాతతో పాటు పరవ ఫిల్మ్స్, వారి సహచరుడు షాన్ ఆంటోనీపై ఫిర్యాదు చేయాలని కోరింది. ఈ విషయం లాభాల పంపిణీకి చెందినదిగా చెబుతున్నారు. ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఈ సినిమాకు వచ్చిన లాభంలో 40 శాతం షేర్ చేయలేదని సినిమాకి ఫైనాన్స్ చేసిన వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో షాన్ ఆంటోనీని ఫైనాన్స్ చేసిన సిరాజ్ వలియతార హమీద్ ప్రధాన నిందితుడిగా చేర్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాలను పంచుకుంటామని నిర్మాతలు హామీ ఇచ్చారని, అయితే అది నెరవేర్చలేదని హమీద్ ఆరోపించారు.
Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్తో చిరంజీవి, రామ్ చరణ్కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఈ కేసులో షాన్ ఆంటోనీని కేరళ పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. అదే సమయంలో, ఫిర్యాదు తర్వాత, సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలో పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టిన డబ్బులు వెనక్కి చేసిన తర్వాత 40 శాతం వచ్చే లాభాల వాటాన్ని కూడా ఇస్తామని తమకు అగ్రిమెంట్ చేసినట్లు ఫైనాన్షియల్ చెబుతున్నారు. ఈ క్రమంలో హమీద్ పరవ ఫిల్మ్స్ ఖాతాకు రూ.5.99 కోట్లు, షాన్ ఆంటోనీ ఖాతాకు రూ.50 లక్షలు పంపాడు. దీని తర్వాత కూడా హమీద్ మరో రూ.51 లక్షలు అప్పుగా ఇచ్చారు. నిర్మాతలు అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు అలాగే లాభాలను కూడా షేర్ చేయలేదు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రం. వెకేషన్లో ఉన్నప్పుడు గుహలో చిక్కుకున్న స్నేహితుల టీం కథే ఈ చిత్రం. ఇది ఫిబ్రవరి 22, 2024న విడుదలైంది. సకల్నిక్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.234.25 కోట్లు రాబట్టింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!