Manjummel Boys: హిట్ సినిమా నిర్మాతలు మోసం చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malyalam Hit Film Manjummel Boys Producers Accused Of Fraud In Profit Sharing: మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఈ ఏడాది విజయవంతమైన సినిమాలలో ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేసింది. తెలుగులో కూడా మంచి టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. వాస్తవానికి, చిత్ర పెట్టుబడిదారు తరపున నిర్మాతలపై చీటింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది. మీడియా నివేదికల ప్రకారం, మంగళవారం ఎర్నాకుళం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కేరళ పోలీసులను చిత్ర నిర్మాతతో పాటు పరవ ఫిల్మ్స్, వారి సహచరుడు షాన్ ఆంటోనీపై ఫిర్యాదు చేయాలని కోరింది. ఈ విషయం లాభాల పంపిణీకి చెందినదిగా చెబుతున్నారు. ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఈ సినిమాకు వచ్చిన లాభంలో 40 శాతం షేర్ చేయలేదని సినిమాకి ఫైనాన్స్ చేసిన వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో షాన్ ఆంటోనీని ఫైనాన్స్ చేసిన సిరాజ్ వలియతార హమీద్ ప్రధాన నిందితుడిగా చేర్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాలను పంచుకుంటామని నిర్మాతలు హామీ ఇచ్చారని, అయితే అది నెరవేర్చలేదని హమీద్ ఆరోపించారు.
Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..
Also Read
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
ఈ కేసులో షాన్ ఆంటోనీని కేరళ పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. అదే సమయంలో, ఫిర్యాదు తర్వాత, సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలో పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టిన డబ్బులు వెనక్కి చేసిన తర్వాత 40 శాతం వచ్చే లాభాల వాటాన్ని కూడా ఇస్తామని తమకు అగ్రిమెంట్ చేసినట్లు ఫైనాన్షియల్ చెబుతున్నారు. ఈ క్రమంలో హమీద్ పరవ ఫిల్మ్స్ ఖాతాకు రూ.5.99 కోట్లు, షాన్ ఆంటోనీ ఖాతాకు రూ.50 లక్షలు పంపాడు. దీని తర్వాత కూడా హమీద్ మరో రూ.51 లక్షలు అప్పుగా ఇచ్చారు. నిర్మాతలు అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు అలాగే లాభాలను కూడా షేర్ చేయలేదు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రం. వెకేషన్లో ఉన్నప్పుడు గుహలో చిక్కుకున్న స్నేహితుల టీం కథే ఈ చిత్రం. ఇది ఫిబ్రవరి 22, 2024న విడుదలైంది. సకల్నిక్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.234.25 కోట్లు రాబట్టింది.
తాజావార్తలు
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!