Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!

Varanasi

Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది. ఈ భారీ బడ్జెట్ సినిమా తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకున్నట్లు తెలిసింది. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే తన టెక్నికల్ టీంతో కలిసి వైజాగ్ లో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో హీరో మహేష్ బాబు కూడా పాల్గొనబోతున్నారట. ఆయనపై కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలను వైజాగ్ లోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్ సినిమాలో కీలకంగా ఉంటుందని సమాచారం.

ఇటీవల హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ తో పాటు, వారణాసిలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు జక్కన్న. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వైజాగ్ లో సందడి చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ విజువల్ వండర్ ను నిర్మిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న ‘వారణాసి’తో ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

×
×
Ad