సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు ‘వారణాసి’ పైనే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాతో మహేష్ బాబు ‘పాన్ వరల్డ్’ స్టార్గా తన గ్లోబల్ జర్నీని మొదలుపెట్టబోతున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్పై ఉండగానే, మహేష్ తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027, ఏప్రిల్ 7న అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘గుంటూరు కారం’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని వారణాసి వస్తుండటంతో, ఈసారి గ్యాప్ లేకుండా మరో సినిమాను లైన్లో పెట్టాలని మహేష్ భావిస్తున్నారట.
Also Read:Dhurandhar 2: తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్
వారణాసితో గ్లోబల్ ఇమేజ్ రాబోతుండటంతో, మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సందీప్ వంగా మేకింగ్ స్టైల్ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటుంది. మహేష్ లాంటి క్లాస్ అండ్ మాస్ హీరోను సందీప్ తనదైన రా-స్టైల్లో చూపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభాస్తో ‘స్పిరిట్’, ఆ తర్వాత ‘యానిమల్ పార్క్’ (సీక్వెల్) ప్రాజెక్టులతో సందీప్ బిజీగా ఉన్నారు. మరి మహేష్ కోసం ఆయన ఎప్పుడు టైం కేటాయిస్తారు అనేది సస్పెన్స్గా మారింది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి ఆయన తర్వాతి ప్రాజెక్ట్ కేవలం తెలుగుకో లేదా ఇండియాకో పరిమితం కాకుండా, గ్లోబల్ ఆడియన్స్ను మెప్పించేలా ఉండాలని మహేష్ పట్టుదలతో ఉన్నారు. వారణాసి పూర్తయ్యేలోపు మహేష్ ఏ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? మళ్ళీ ఏదైనా ప్రయోగాత్మక చిత్రంతో వస్తారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.