Guntur Kaaram: అన్నా..వెకేషన్లో సినిమా చేస్తున్నావా?.. సినిమా మధ్యలో వెకేషన్ తీసుకుంటున్నావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu is taking a break again from Guntur Kaaram: అతడు, మహేష్ ఖలేజా లాంటి సినిమాలు తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ ఏదో ఒక కారణంతో సినిమా షూటింగ్ అయితే వాయిదా పడుతూనే వచ్చింది. ముందుగా మహేష్ తల్లి మరణించడం తర్వాత ఆయన తండ్రి మరణించడం, స్క్రిప్ట్ లో మార్పులు, హీరోయిన్ల డేట్లు సర్దుబాటు అంశం, ఆ తర్వాత పూజా హెగ్డేని తప్పించడం, ఇలా ఏదో ఒక కారణం చేత సినిమా షూటింగ్ అయితే వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు షూట్ పరుగులు పెడుతుంది అని అనుకుంటున్న తరుణంలో తాజాగా మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుతో చేయాల్సిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేశారని, అయితే తన కుమార్తె సితార పుట్టినరోజు జూలై 20వ తేదీన ఉండడంతో కుటుంబ సభ్యులందరినీ తీసుకుని ఆయన దుబాయ్ పయనం అయినట్టు తెలుస్తోంది.
Priya Prakash Varrier: ఆ వీడియో తర్వాత తప్పుడు నిర్ణయాలు.. ప్రియా ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
అయితే సినిమా షూటింగ్ నుంచి మహేష్ దూరం అవుతున్నా సరే షూటింగ్ కి విరామం ఇవ్వకుండా త్రివిక్రమ్ షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో లేని సీన్స్ షూటింగ్ అయిన పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు మాత్రం అన్నా..వెకేషన్లో సినిమా చేస్తున్నావా?.. సినిమా మధ్యలో వెకేషన్ తీసుకుంటున్నావా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం కుమార్తె పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోవద్దా? అంటూ ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇక ఈ సినిమాలో ముందుగా పూజ హెగ్డే, శ్రీ లీల ఇద్దరినీ హీరోయిన్లుగా అనుకున్నారు కానీ పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీ లీలలు మెయిన్ హీరోయిన్ గా చేసి ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరిని తీసుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా తాజాగా జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీనాక్షి చౌదరి స్వయంగా వెల్లడించింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!