Chrisann Pereira: టాయిలెట్ వాటర్తో కాఫీ.. డిటర్జెంట్ సబ్బులో జట్టు కడుక్కున్న.. జైలు కష్టాలు చెప్పిన బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chrisann Pereira: డ్రగ్స్ కేసులో షార్జా జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా తన జైలు అనుభవాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆమె యూఏఈ జైలులో శిక్ష అనుభవిస్తోంది. జైలులో తన జుట్టును డిటర్జెంట్ సబ్బుతో కడుకున్నానని, టాయిలెట్ వాటర్ తో కాఫీ తయారు చేసిన విషయాలని ఓ లేఖలో వెల్లడించింది. 26 రోజుల జైలు శిక్ష అనంతరం బుధవారం సాయంత్రం విడుదలైన క్రిసాన్ త్వరలోనే ఇండియా చేరుకోనున్నారు.
Read Also: SCO Meeting: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రితో చర్చలు..
Also Read
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
జైలులో తనకు పెన్ను, పేపర్ దొరకడానికి మూడు వారాల ఐదురోజు పట్టింది. నేను టైడ్ సబ్బుతో జట్టును కడుక్కుని, టాయిలెట్ వాటర్ ఉపయోగించి కాఫీ చేసిన తర్వాత,కొన్ని సార్లు కన్నీళ్లు కారుస్తూ బాలీవుడ్ సినిమాలు చూశానని, నా ఆశయం నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని తెలుసని, కొన్నిసార్లు మన సంస్కృతి, మన సినిమాలు, టీవీలో తెలిసి ముఖాలను చూసి నవ్వుతాను, నేను భారతీయురాలిగా, భారత సినిమా ఫీల్డ్ కు చెందినందుకు గర్వపడుతున్నానని ఆమె లేఖలో రాసింది. తన కుటుంబం, స్నేహితులకు, పోలీసులకు, చర్చి, మీడియా తనను అమాయకురాలని నమ్మినందుకు థాంక్స్ చెప్పింది. మాన్స్టర్స్ ఆడే థర్టీ గేమ్ లో బలిపశువుగా మారానని అమె చెప్పుకొచ్చింది. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిజమైన నేరస్థులను అరెస్ట్ చేయడానికి సహరించిన అందరికి కృతజ్ఞుతలను తెలియజేశారు. ఈ స్కామ్ లో చిక్కుకున్న నాతోపాటు ఇతర అమాయకుల ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయం ఎల్లప్పుడు గెలుస్తుందని ఆమె లేఖలో పేర్కొంది.
బోరివలికి చెందిన బేకరీ యజమాని ఆంథోని పాల్(35) డ్రగ్స్ కేసులో క్రిసాన్ ను ఇరికించాడు. దీంతో ఆమెను యూఏఈ పర్యటనలో ఉండగా ఏప్రిల్ 1న షార్జాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంథోని పాల్ స్నేహితుడు రాజేష్ బోరాటే టాలెంట్ మేనేజర్ రవిగా నటించాడు. గతంలో సడక్ 2, బాట్లా హౌజ్ వంటి చిత్రాలకు పనిచేసినట్లు ఆమెను సంప్రదించాడు. బోరాటే రవిగా నటిస్తూ.. షార్జాలో అంతర్జాతీయ వెబ్ సిరీస్ ఆడిషన్ కోసం హాజరు కావాలని క్రిసాన్ ను కోరారుడ. దీంతో ఆమె షార్జా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంది. ఆమె వెళ్తున్న క్రమంలో డ్రగ్స్ తో కూడిన ఓ మెమెంటోను పథకం ప్రకారం ఆమెకు ఇచ్చాడు. నిందితులు షార్జా పోలీసులకు సమాచారం ఇచ్చి క్రిసాన్ అరెస్ట్ అయ్యేలా పథకం వేశారు. క్రిసాన్ పెరీరా తల్లితో జరగిన గొడవ కారణంగా ఆంథోని పాల్ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఇలా పథకం ప్రకారం నటి క్రిసాన్ పెరీరాను ఇరికించాడు.
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!