Chrisann Pereira: టాయిలెట్ వాటర్తో కాఫీ.. డిటర్జెంట్ సబ్బులో జట్టు కడుక్కున్న.. జైలు కష్టాలు చెప్పిన బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chrisann Pereira: డ్రగ్స్ కేసులో షార్జా జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా తన జైలు అనుభవాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆమె యూఏఈ జైలులో శిక్ష అనుభవిస్తోంది. జైలులో తన జుట్టును డిటర్జెంట్ సబ్బుతో కడుకున్నానని, టాయిలెట్ వాటర్ తో కాఫీ తయారు చేసిన విషయాలని ఓ లేఖలో వెల్లడించింది. 26 రోజుల జైలు శిక్ష అనంతరం బుధవారం సాయంత్రం విడుదలైన క్రిసాన్ త్వరలోనే ఇండియా చేరుకోనున్నారు.
Read Also: SCO Meeting: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రితో చర్చలు..
Also Read
- Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
- The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. 'ది ఒడిస్సీ'కి అదిరిపోయే ఓపెనింగ్!
- Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
జైలులో తనకు పెన్ను, పేపర్ దొరకడానికి మూడు వారాల ఐదురోజు పట్టింది. నేను టైడ్ సబ్బుతో జట్టును కడుక్కుని, టాయిలెట్ వాటర్ ఉపయోగించి కాఫీ చేసిన తర్వాత,కొన్ని సార్లు కన్నీళ్లు కారుస్తూ బాలీవుడ్ సినిమాలు చూశానని, నా ఆశయం నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని తెలుసని, కొన్నిసార్లు మన సంస్కృతి, మన సినిమాలు, టీవీలో తెలిసి ముఖాలను చూసి నవ్వుతాను, నేను భారతీయురాలిగా, భారత సినిమా ఫీల్డ్ కు చెందినందుకు గర్వపడుతున్నానని ఆమె లేఖలో రాసింది. తన కుటుంబం, స్నేహితులకు, పోలీసులకు, చర్చి, మీడియా తనను అమాయకురాలని నమ్మినందుకు థాంక్స్ చెప్పింది. మాన్స్టర్స్ ఆడే థర్టీ గేమ్ లో బలిపశువుగా మారానని అమె చెప్పుకొచ్చింది. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిజమైన నేరస్థులను అరెస్ట్ చేయడానికి సహరించిన అందరికి కృతజ్ఞుతలను తెలియజేశారు. ఈ స్కామ్ లో చిక్కుకున్న నాతోపాటు ఇతర అమాయకుల ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయం ఎల్లప్పుడు గెలుస్తుందని ఆమె లేఖలో పేర్కొంది.
బోరివలికి చెందిన బేకరీ యజమాని ఆంథోని పాల్(35) డ్రగ్స్ కేసులో క్రిసాన్ ను ఇరికించాడు. దీంతో ఆమెను యూఏఈ పర్యటనలో ఉండగా ఏప్రిల్ 1న షార్జాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంథోని పాల్ స్నేహితుడు రాజేష్ బోరాటే టాలెంట్ మేనేజర్ రవిగా నటించాడు. గతంలో సడక్ 2, బాట్లా హౌజ్ వంటి చిత్రాలకు పనిచేసినట్లు ఆమెను సంప్రదించాడు. బోరాటే రవిగా నటిస్తూ.. షార్జాలో అంతర్జాతీయ వెబ్ సిరీస్ ఆడిషన్ కోసం హాజరు కావాలని క్రిసాన్ ను కోరారుడ. దీంతో ఆమె షార్జా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంది. ఆమె వెళ్తున్న క్రమంలో డ్రగ్స్ తో కూడిన ఓ మెమెంటోను పథకం ప్రకారం ఆమెకు ఇచ్చాడు. నిందితులు షార్జా పోలీసులకు సమాచారం ఇచ్చి క్రిసాన్ అరెస్ట్ అయ్యేలా పథకం వేశారు. క్రిసాన్ పెరీరా తల్లితో జరగిన గొడవ కారణంగా ఆంథోని పాల్ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఇలా పథకం ప్రకారం నటి క్రిసాన్ పెరీరాను ఇరికించాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!