Suddala Ashok Teja: తెలుగు సినీ సాహితీవనంలో అశోక తేజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు పాటకు వెలుగుబాటలు చూపిన వారెందరో! వారిలో ప్రజాకవులది ప్రధాన పాత్ర. సుద్దాల హనుమంతు పాట తెలుగునేలను పులకింప చేసింది. ప్రజాకవిగా ఆయన సాగిన తీరును ఈ నాటికీ గుర్తు చేసుకొనేవారెందరో! హనుమంతు తనయుడు అశోక్ తేజ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక చిత్రసీమలోనూ తనదైన పంథాలో పయనిస్తూ పదనిసలకు తగ్గ పదాలను, సరిగమలకు సరితూగే సమాసాలను పొందుపరుస్తూ సాగుతున్నారు. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలచిన తెలుగు సినిమా కవి సుద్దాల అశోక్ తేజ! ‘నేను సైతం…’ అంటూ శ్రీశ్రీ పల్లవించిన తీరునే అనుసరిస్తూ ‘ఠాగూర్’ సినిమా కోసం సుద్దాల అల్లిన పదబంధాలు ఆయనకు ఉత్తమ గీత రచయితగా నేషనల్ అవార్డును సంపాదించి పెట్టాయి. ఈ నాటికీ చిత్రసీమలో ‘నేను సైతం…’ అంటూ తనదైన బాణీ పలికిస్తున్నారు సుద్దాల అశోక్ తేజ.
సుద్దాల హనుమంతు, జానకమ్మ దంపతులకు 1959 మే 16న అశోక్ తేజ జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నచందాన హనుమంతు కడుపున పుట్టిన అశోక్ తేజకు కూడా చిన్నతనంలోనే కవిత్వం అబ్బింది. బాల్యంలోనే పాటలు రాస్తూ వాటిని రాగయుక్తంగా పాడుతూ తిరిగేవాడు అశోక్. తరువాత మాతృభాషలో పట్టుసాధించి, పంతులుగా వృత్తి సాగించారు. మెట్ పల్లిలో సుద్దాల అశోక్ తేజ టీచర్ గా పనిచేశారు. సుద్దాల అశోక్ తేజ సోదరి తనయుడు ప్రముఖ నటుడు ఉత్తేజ్. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో ఉత్తేజ్ నటునిగా మంచి గుర్తింపు సంపాదించారు. అదే తీరున ఉత్తేజ్ కు దర్శకుడు కృష్ణవంశీతోనూ మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో తన మేనమామలోని కవిని కృష్ణవంశీకి పరిచయం చేశారు ఉత్తేజ్. కృష్ణవంశీ అశోక్ తేజను ప్రోత్సహించారు. తరువాత దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి సీనియర్ డైరెక్టర్స్ సైతం అశోక్ తేజకు అవకాశాలు కల్పించారు.
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Idupu Kayitham : 'ఇడుపు కాయితం' చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ అశోక్ తేజ వినియోగించుకున్నారు. తనదైన పదాలతో పాటలు పలికించారు. ఈ మధ్యకాలంలో ‘ట్రిపుల్ ఆర్’లో సుద్దాల అశోక్ తేజ రాసిన “కొమురం భీముడో…” పాట విపరీతమైన ఆదరణ పొందింది. అందులో ఆ నాటి తెలంగాణ పదాలను చొప్పించిన తీరును చూసి, ఎంతోమంది సాహితీప్రియులు సుద్దాల అశోక్ తేజకు జేజేలు పలికారు. దాసరి దర్శకత్వంలో రూపొందిన “కంటే కూతుర్నే కను, మేస్త్రి” చిత్రాల ద్వారా ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు అందుకున్నారు సుద్దాల అశోక్ తేజ. ఇక చిరంజీవి ‘ఠాగూర్’లో “నేను సైతం…” అంటూ సాగే పాటతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నిలిచారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే తెలిసిన సుద్దాల అశోక్ తేజ, ఇప్పటికీ తన చెంతకు చేరిన అవకాశానికి తగ్గ పదాలను అందించాలనే తపిస్తూ ఉంటారు.
తాజావార్తలు
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!