Suddala Ashok Teja: తెలుగు సినీ సాహితీవనంలో అశోక తేజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు పాటకు వెలుగుబాటలు చూపిన వారెందరో! వారిలో ప్రజాకవులది ప్రధాన పాత్ర. సుద్దాల హనుమంతు పాట తెలుగునేలను పులకింప చేసింది. ప్రజాకవిగా ఆయన సాగిన తీరును ఈ నాటికీ గుర్తు చేసుకొనేవారెందరో! హనుమంతు తనయుడు అశోక్ తేజ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక చిత్రసీమలోనూ తనదైన పంథాలో పయనిస్తూ పదనిసలకు తగ్గ పదాలను, సరిగమలకు సరితూగే సమాసాలను పొందుపరుస్తూ సాగుతున్నారు. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలచిన తెలుగు సినిమా కవి సుద్దాల అశోక్ తేజ! ‘నేను సైతం…’ అంటూ శ్రీశ్రీ పల్లవించిన తీరునే అనుసరిస్తూ ‘ఠాగూర్’ సినిమా కోసం సుద్దాల అల్లిన పదబంధాలు ఆయనకు ఉత్తమ గీత రచయితగా నేషనల్ అవార్డును సంపాదించి పెట్టాయి. ఈ నాటికీ చిత్రసీమలో ‘నేను సైతం…’ అంటూ తనదైన బాణీ పలికిస్తున్నారు సుద్దాల అశోక్ తేజ.
సుద్దాల హనుమంతు, జానకమ్మ దంపతులకు 1959 మే 16న అశోక్ తేజ జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నచందాన హనుమంతు కడుపున పుట్టిన అశోక్ తేజకు కూడా చిన్నతనంలోనే కవిత్వం అబ్బింది. బాల్యంలోనే పాటలు రాస్తూ వాటిని రాగయుక్తంగా పాడుతూ తిరిగేవాడు అశోక్. తరువాత మాతృభాషలో పట్టుసాధించి, పంతులుగా వృత్తి సాగించారు. మెట్ పల్లిలో సుద్దాల అశోక్ తేజ టీచర్ గా పనిచేశారు. సుద్దాల అశోక్ తేజ సోదరి తనయుడు ప్రముఖ నటుడు ఉత్తేజ్. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో ఉత్తేజ్ నటునిగా మంచి గుర్తింపు సంపాదించారు. అదే తీరున ఉత్తేజ్ కు దర్శకుడు కృష్ణవంశీతోనూ మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో తన మేనమామలోని కవిని కృష్ణవంశీకి పరిచయం చేశారు ఉత్తేజ్. కృష్ణవంశీ అశోక్ తేజను ప్రోత్సహించారు. తరువాత దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి సీనియర్ డైరెక్టర్స్ సైతం అశోక్ తేజకు అవకాశాలు కల్పించారు.
Also Read
- SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
- June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ అశోక్ తేజ వినియోగించుకున్నారు. తనదైన పదాలతో పాటలు పలికించారు. ఈ మధ్యకాలంలో ‘ట్రిపుల్ ఆర్’లో సుద్దాల అశోక్ తేజ రాసిన “కొమురం భీముడో…” పాట విపరీతమైన ఆదరణ పొందింది. అందులో ఆ నాటి తెలంగాణ పదాలను చొప్పించిన తీరును చూసి, ఎంతోమంది సాహితీప్రియులు సుద్దాల అశోక్ తేజకు జేజేలు పలికారు. దాసరి దర్శకత్వంలో రూపొందిన “కంటే కూతుర్నే కను, మేస్త్రి” చిత్రాల ద్వారా ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు అందుకున్నారు సుద్దాల అశోక్ తేజ. ఇక చిరంజీవి ‘ఠాగూర్’లో “నేను సైతం…” అంటూ సాగే పాటతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నిలిచారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే తెలిసిన సుద్దాల అశోక్ తేజ, ఇప్పటికీ తన చెంతకు చేరిన అవకాశానికి తగ్గ పదాలను అందించాలనే తపిస్తూ ఉంటారు.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!