Veera Simha Reddy:సింహా టైటిల్ అచ్చి వచ్చిన తెలుగు హీరోల్లో నందమూరి బాలకృష్ణ ప్రముఖుడు. తాజాగా ఆయనతో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే పేరు పెట్టడంతో నందమూరి అభిమానుల ఆనందాన్ని అవధులు లేకుండా ఉంది. ఈ మూవీని సంబంధించి ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ని బాలకృష్ణ, విలన్ బ్యాచ్ పై పిక్చరైజ్ చేస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్ని పర్యవేక్షిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికి స్వరరచన చేస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చుతున్నారు. ‘వీరసింహారెడ్డి’ మూవీ 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.