ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా మీద మనసు పారేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియా లెవల్లో సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇక ఈ తాను కూడా పాన్ ఇండియాకు సిద్ధం అంటున్నాడు కోలీవుడ్ హీరో విశాల్. ఇటీవలే సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఈసారి కొత్త పంథాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే టెంపర్ రీమేక్ లో పోలీస్ గా కనిపించిన విశాల్.. మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న కొత్త చిత్రం లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విశాల్ సరసన సునయన నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో విశాల్ ఇంటెన్సివ్ లుక్ ఆకట్టుకొంటుంది. ఖాకీ డ్రెస్ లో లాఠీ పట్టుకుని ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా డ్యూటీ చేస్తున్నట్లు కనిపించాడు. దీంతో ఈ సినిమాలో విశాల్ పోరు ఫుల్ పోలీస్ కాప్ గా కనిపించబోతున్నాడన్నమాట. ఇక ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం విశాల్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి పీటర్ హెయిన్, దీలీప్ సుబ్బరాయన్ యాక్షన్ ఘట్టాలని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ షూటింగ్ లో విశాల్ కి గాయాలు అయ్యాయని సమాచారం. మరి అంత రిస్క్ చేసి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
@_RanaProduction @dir_vinothkumar @actorramanaa @nandaa_actor @balasubramaniem @PeterHeinOffl @thisisysr @DOP_bala @TheSunainaa @skannanartdir @srikanth_nb @vasukibhaskar @HariKr_official @johnsoncinepro @ajay_64403 pic.twitter.com/EuRayiU4px
— Vishal (@VishalKOfficial) April 6, 2022