Kollywood: మా మీద ఈ ఏడుపు ఎందుకు బ్రో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ ఫేజ్ లో ఉంది. బాహుబలితో మన సినిమా గతిని మార్చిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మన సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు. రాజమౌళి వేసిన దారిలో సుకుమార్ వెళ్లి పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఎన్నడూ లేనిది మొదటిసారి ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఏ ఫేజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనా తర్వాత అన్ని ఇండస్ట్రీల కన్నా ఎక్కువ హిట్స్, ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేసిన ఇండస్ట్రీ తెలుగు చిత్ర పరిశ్రమనే. అంతెందుకు ప్రస్తుతం అన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల కన్నా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే. సలార్, OG, పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర, టైగర్ నాగేశ్వర రావు లాంటి సినిమాలు నెక్స్ట్ ఇయర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాయి.
ఇప్పుడు తెలుగు సినిమా ఉన్న గోల్డెన్ ఫేజ్ లో ఒకప్పుడు తమిళ సినిమా ఉండేది. శంకర్, మణిరత్నం, వెట్రిమారన్ లాంటి దర్శకులు తమిళ సినిమాని బౌండరీలు దాటించారు. వెట్రిమారన్ లాంటి దర్శకుడు చేసింది అయిదారు సినిమాలే అయినా నాలుగు నేషనల్ అవార్డ్స్ ని తీసుకున్నాడు. సడన్ గా శంకర్ డౌన్ అవ్వడం, మణిరత్నం మునపటిలా సినిమాలు చేయలేకపోవడం, వెట్రిమారన్ విడుదలై కోసం కొంచెం గ్యాప్ తీసుకోవడంతో కోలీవుడ్ నుంచి సరైన సినిమాలు రావట్లేదు. అసురన్ లాంటి సినిమాలో ఎంత మెసేజ్ ఉంటుందో అంతే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ఆ బాలన్స్ ఉన్నప్పుడే అన్ని వర్గాలకి ఆ సినిమా నచ్చుతుంది.
Also Read
- Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
- Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
- Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
- Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అంతా కంటెంట్ ని వదిలి కమర్షియల్ బాట పట్టడమే కోలీవుడ్ దెబ్బ తినడానికి కూడా కారణం అయ్యింది. కమర్షియల్ సినిమాకి సోషల్ మెసేజ్ అద్దడంలో కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దిట్ట, ఇప్పుడు ఇదే కరువయ్యింది. అయితే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు లేక హీరోయిజం ఎలివేట్ చేసే కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ఈ రెండు బాలన్స్ చేస్తూ సాగే సినిమాని మాత్రం కోలీవుడ్ పూర్తిగా మర్చిపోయింది. మళ్లీ అలాంటి సినిమాలు వస్తేనే కోలీవుడ్ కి పూర్వవైభవం వస్తుంది. నిజానికి కోలీవుడ్ లో కోవిడ్ ఎరాలో కూడా ఎక్కడో ఎప్పుడో జై భీమ్, సార్పట్ట పరంబర్తె లాంటి సినిమాలు వస్తున్నా కూడా అది ఓటీటీలకి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ విషయం అర్ధం చేసుకోకుండా తెలుగు సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమకి మొండి చెయ్యి చూపించారు, మా సినిమాలకి అన్యాయం చేసారు అంటూ కొందరు మేధావులు తెలుగు హీరోలపైన, తెలుగు సినిమాపైన పడి ఏడుస్తుండడం విచారం.
తాజావార్తలు
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!