Kollywood: మా మీద ఈ ఏడుపు ఎందుకు బ్రో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ ఫేజ్ లో ఉంది. బాహుబలితో మన సినిమా గతిని మార్చిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మన సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు. రాజమౌళి వేసిన దారిలో సుకుమార్ వెళ్లి పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఎన్నడూ లేనిది మొదటిసారి ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఏ ఫేజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనా తర్వాత అన్ని ఇండస్ట్రీల కన్నా ఎక్కువ హిట్స్, ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేసిన ఇండస్ట్రీ తెలుగు చిత్ర పరిశ్రమనే. అంతెందుకు ప్రస్తుతం అన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల కన్నా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే. సలార్, OG, పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర, టైగర్ నాగేశ్వర రావు లాంటి సినిమాలు నెక్స్ట్ ఇయర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాయి.
ఇప్పుడు తెలుగు సినిమా ఉన్న గోల్డెన్ ఫేజ్ లో ఒకప్పుడు తమిళ సినిమా ఉండేది. శంకర్, మణిరత్నం, వెట్రిమారన్ లాంటి దర్శకులు తమిళ సినిమాని బౌండరీలు దాటించారు. వెట్రిమారన్ లాంటి దర్శకుడు చేసింది అయిదారు సినిమాలే అయినా నాలుగు నేషనల్ అవార్డ్స్ ని తీసుకున్నాడు. సడన్ గా శంకర్ డౌన్ అవ్వడం, మణిరత్నం మునపటిలా సినిమాలు చేయలేకపోవడం, వెట్రిమారన్ విడుదలై కోసం కొంచెం గ్యాప్ తీసుకోవడంతో కోలీవుడ్ నుంచి సరైన సినిమాలు రావట్లేదు. అసురన్ లాంటి సినిమాలో ఎంత మెసేజ్ ఉంటుందో అంతే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ఆ బాలన్స్ ఉన్నప్పుడే అన్ని వర్గాలకి ఆ సినిమా నచ్చుతుంది.
Also Read
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అంతా కంటెంట్ ని వదిలి కమర్షియల్ బాట పట్టడమే కోలీవుడ్ దెబ్బ తినడానికి కూడా కారణం అయ్యింది. కమర్షియల్ సినిమాకి సోషల్ మెసేజ్ అద్దడంలో కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దిట్ట, ఇప్పుడు ఇదే కరువయ్యింది. అయితే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు లేక హీరోయిజం ఎలివేట్ చేసే కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ఈ రెండు బాలన్స్ చేస్తూ సాగే సినిమాని మాత్రం కోలీవుడ్ పూర్తిగా మర్చిపోయింది. మళ్లీ అలాంటి సినిమాలు వస్తేనే కోలీవుడ్ కి పూర్వవైభవం వస్తుంది. నిజానికి కోలీవుడ్ లో కోవిడ్ ఎరాలో కూడా ఎక్కడో ఎప్పుడో జై భీమ్, సార్పట్ట పరంబర్తె లాంటి సినిమాలు వస్తున్నా కూడా అది ఓటీటీలకి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ విషయం అర్ధం చేసుకోకుండా తెలుగు సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమకి మొండి చెయ్యి చూపించారు, మా సినిమాలకి అన్యాయం చేసారు అంటూ కొందరు మేధావులు తెలుగు హీరోలపైన, తెలుగు సినిమాపైన పడి ఏడుస్తుండడం విచారం.
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!