ఏ సమస్యైనా, సంక్షోభమైన ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్స్టా పోస్ట్ హాట్టాపిక్గా మారింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్లో తాలిబన్ల ఆరాచాకాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కంగనా తాలిబన్లపై తాను షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టులు కనిపించడం లేదంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు, చైనాకు చెందినవారు తన ఇన్స్టా ఖాతాను హ్యాక్ చేసినట్లు అలర్ట్ వచ్చిందని తెలిపింది. దీంతో నిర్వహాకులకు ఫిర్యాదు చేయడంతో తన ఇన్స్టా అకౌంట్ ను తిరిగిపొందానని పేర్కొంది. అయితే తాలిబన్లపై మాత్రమే కాకుండా.. ఏ పోస్ట్ చేద్దామనుకున్న లాగ్ అవుట్ అవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె సిస్టర్ సెల్ లో తన అకౌంట్ లాగిన్ అయ్యి పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇదంత చూస్తుంటే అంతర్జాతీయ కుట్రలో భాగం అనిపిస్తుందని’ తన పోస్ట్లో రాసుకొచ్చింది.