నందమూరి కళ్యాణ్ రామ్ 2023 లో ఆయన చివరి సినిమా డెవిల్ మంచి పేరు తీసుకు వచ్చింది కానీ కమర్షియల్ గా మెప్పించలేదు. గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
Also Read : Rayna Rao : బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన హీరోయిన్
మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ‘‘కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది. అలాగే ‘రుద్ర’అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నారు. అయితే ఆ రెండు కాకుండా ఈ సినిమాకు లేటెస్ట్ గా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. వైజయంతిపవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి కనిపించబోతుంది. చిత్ర కథ నేపధ్యానికి అనుగుణంగా ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.