Kalyan Ram Reveals Real Reason Behind NTR30 Delay: ‘NTR30’ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలం అవుతోన్నా.. ఇంతవరకూ సెట్స్ మీదకి వెళ్లలేదు. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అంటూ.. ఆలస్యం చేస్తూనే ఉన్నారు. ఆమధ్య ఫిబ్రవరిలో పట్టాలెక్కబోతోందని జోరుగా ప్రచారాలు జరిగాయి కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలోనే ‘స్క్రిప్ట్’ ఫైనల్ కాకపోవడం వల్లే ఈ చిత్రం డిలే అవుతోందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇది నిజమేనని పరోక్షంగా ఖరారు చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్.
NTR30 సినిమాను యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే! తాజాగా తన ‘బింబిసార’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కళ్యాణ్.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్30 ఆలస్యానికి గల అసలు కారణాన్ని రివీల్ చేశాడు. ‘‘NTR30 ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సింది. అయితే.. ఆర్ఆర్ఆర్ రాకతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. ఆ సినిమా తర్వాత తారక్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. తద్వారా తాను చేయబోయే ప్రతీ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందాలని తారక్ నిర్ణయించాడు. దీంతో.. అన్నీ చక్కగా కుదరాలని కొరటాల శివ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు’’ అని కళ్యా్ణ్ వెల్లడించాడు.
చూస్తుంటే.. తారక్ పాన్ ఇండియా హీరోగా అవతరించిన తర్వాత కొరటాల మొత్తం స్క్రిప్ట్ మార్చేసినట్టు కనిపిస్తోంది. తారక్ సూచనల మేరకు హిందీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు స్క్రిప్టులో మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి స్టాండర్డ్స్ని అందుకోవాలంటే, అంత మామూలు విషయం కాదు కదా! తారక్ సైతం స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది.