Krishnam Raju: కృష్ణంరాజు కోసం జగన్ కీలక నిర్ణయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnam Raju:రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి టాలీవుడ్ కు తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం విదితమే. నేడు మొగల్తూరులో ఆయన సంస్కరణ సభను ప్రభాస్ ఘనంగా నిర్వహిస్తున్నాడు. లక్షమందికి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారందరు తిని వెళ్ళారా..? అన్నది కూడా పట్టించుకుంటున్నాడు. అభిమానులతో పాటు మొగల్తూరుకు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యి ప్రభాస్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇక తాజాగా కృష్ణంరాజు కోసం సీఎం జగన్ కీలక నిర్ణయంతీసుకున్నారు. నేడు మొగల్తూరు లో కృష్ణంరాజు ఇంటికి వచ్చి కుటుంబ మంత్రులు ఈ విషయాన్నీ మీడియా ముఖంగా తెలిపారు. నర్సాపురం పేరుపాలెం బీచ్ లో కృష్ణంరాజు స్మృతి వనాన్ని నిర్మించనున్నట్లు జగన్ ప్రకటించారు.
ఏపీ ప్రభత్వం తరుపున రెండెకరాల స్థలాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ మంత్రులు సైతం ప్రకటించారు. కుటుంబ సభ్యులు కోరుకున్న చోట భూమి ఇచ్చేందుకు సిద్ధమని, కృష్ణంరాజు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. రెండు మూడు స్థలాలు ఇప్పటికే కలెక్టర్ చూశారని, అందులో ఒకటి కుటుంబ సభ్యులు ఓకే చేస్తే ఆయన గుర్తుగా విగ్రహం పెట్టించి దాన్ని పర్యాటక స్థలంగా మారుస్తామని తెలిపారు. ఇక ఈ విషయమై ఉప్పలపాటి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే కృష్ణంరాజు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి పనులు మొదలుపెట్టనున్నారని సమాచారం.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!