Padma Bhushan Award: పద్మభూషణ్ అందుకున్న మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mithun Chakraborty Received Padma Bhushan Award By President Draupadi Murmu: సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, దివంగత సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, ప్రఖ్యాత భరతనాట్యం నృత్యకారిణి పద్మా సుబ్రమణ్యంలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతుప్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్లకు పద్మభూషణ్ లభించింది. పద్మ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజా సేవ, సైన్స్, సాహిత్యం మరియు క్రీడలు వంటి వివిధ రంగాలలో రాణించిన వ్యక్తులకు ఇచ్చే దేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో పద్మ అవార్డులు ముఖ్యమైనవి. అసాధారణమైన – విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలకు పద్మశ్రీ అవార్డులు అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 132 మంది వ్యక్తులకు పద్మ అవార్డుతో సత్కరించనున్నట్లు ప్రకటించారు.
Twinkle Khanna: దావూద్ పార్టీలో హీరోయిన్ డాన్స్.. షాకింగ్ కామెంట్స్
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
వీరిలో ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూషణ్ మరియు 110 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈసారి పద్మ అవార్డులు అందుకున్నవారిలో 30 మంది మహిళలు ఉండగా, మరణానంతరం 9 మందికి పద్మ అవార్డులు లభించాయి. దాదాపు సగం మంది అవార్డు విజేతలు సోమవారం నాటి వేడుకలో గౌరవాలను అందుకున్నారు, మిగిలిన వారు వచ్చే వారం అందుకుంటారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. అయితే, 1978, 1979 మరియు 1993 నుండి 1997 సంవత్సరాలలో, కొన్ని కారణాల వల్ల గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాటిని ప్రకటించలేకపోయారు. మిథున్ చక్రవర్తి భారతీయ సినిమాకు చేసిన కృషికి మరియు సామాజిక సేవలో చురుకుగా ఉన్నందుకు పద్మభూషణ్ అందుకున్నారు. మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్లో 350కి పైగా సినిమాలకు పనిచేశారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉషా ఉతుప్ పద్మభూషణ్ అందుకున్నారు. ఎన్నో పాటలకు ఆమె తన గాత్రాన్ని అందించారు. ఉషా ఉతుప్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గాయని.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!