Padma Bhushan Award: పద్మభూషణ్ అందుకున్న మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mithun Chakraborty Received Padma Bhushan Award By President Draupadi Murmu: సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, దివంగత సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, ప్రఖ్యాత భరతనాట్యం నృత్యకారిణి పద్మా సుబ్రమణ్యంలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతుప్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్లకు పద్మభూషణ్ లభించింది. పద్మ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజా సేవ, సైన్స్, సాహిత్యం మరియు క్రీడలు వంటి వివిధ రంగాలలో రాణించిన వ్యక్తులకు ఇచ్చే దేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో పద్మ అవార్డులు ముఖ్యమైనవి. అసాధారణమైన – విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలకు పద్మశ్రీ అవార్డులు అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 132 మంది వ్యక్తులకు పద్మ అవార్డుతో సత్కరించనున్నట్లు ప్రకటించారు.
Twinkle Khanna: దావూద్ పార్టీలో హీరోయిన్ డాన్స్.. షాకింగ్ కామెంట్స్
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
వీరిలో ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూషణ్ మరియు 110 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈసారి పద్మ అవార్డులు అందుకున్నవారిలో 30 మంది మహిళలు ఉండగా, మరణానంతరం 9 మందికి పద్మ అవార్డులు లభించాయి. దాదాపు సగం మంది అవార్డు విజేతలు సోమవారం నాటి వేడుకలో గౌరవాలను అందుకున్నారు, మిగిలిన వారు వచ్చే వారం అందుకుంటారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. అయితే, 1978, 1979 మరియు 1993 నుండి 1997 సంవత్సరాలలో, కొన్ని కారణాల వల్ల గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాటిని ప్రకటించలేకపోయారు. మిథున్ చక్రవర్తి భారతీయ సినిమాకు చేసిన కృషికి మరియు సామాజిక సేవలో చురుకుగా ఉన్నందుకు పద్మభూషణ్ అందుకున్నారు. మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్లో 350కి పైగా సినిమాలకు పనిచేశారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉషా ఉతుప్ పద్మభూషణ్ అందుకున్నారు. ఎన్నో పాటలకు ఆమె తన గాత్రాన్ని అందించారు. ఉషా ఉతుప్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గాయని.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!