టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది .దీనితో మహేష్ తరువాత సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది .మహేష్ తన తరువాత సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు..ఈ సినిమా మహేష్ బాబు 29 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే మహేష్ , రాజమౌళి సినిమాపై వస్తున్న అప్డేట్లు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉందబోతుందో కథా రచయిత అయిన విజయేంద్రప్రసాద్ పలు హింట్స్ అందించారు. రాజమౌళి,నేను దక్షిణాఫ్రికా నవలా రచయిత అయిన విల్బర్ స్మిత్కు బిగ్ ఫ్యాన్స్ అని ఆయన తెలిపారు. ఆయన రచించిన పుస్తకాల ఆధారంగానే ఈ మూవీ స్క్రిప్ట్ని రాసినట్లుగా ఆయన ఓ వేదికపై తెలిపారు.హనుమంతుడిని పోలిన లక్షణాలతో ఇందులో మహేశ్ పాత్రను రాజమౌళి డిజైన్ చేసినట్టు సమాచారం.
ఇదిలా వుంటే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ఓ విదేశీభామ నటిస్తున్నట్లు సమాచారం .అలాగే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలియాభట్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రెస్ మీట్ ని సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న నిర్వహించనున్నట్టు గతంలో తెగ వార్తలు వచ్చాయి.అలాగే మహేశ్ పుట్టినరోజైన ఆగస్ట్ 9న పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం.రాజమౌళి ఈ సినిమాను తనదైన మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. కె.ఎల్.నారాయణ ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.