Allu Arjun: టార్గెట్ ఫిక్స్… ఈసారి బౌండరీలు దాటబోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్న పుష్పరాజ్, తన రూలింగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాని పార్ట్ 1 కన్నా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ డిసెంబర్ లో కానీ 2024 సమ్మర్ లో కానీ పుష్ప 2 సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా అనౌన్స్ చేసాడు, కొరటాల శివతో కూడా ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ అఫీషియల్ గా అనౌన్స్ అయినవే. కొరటాల శివ-అల్లు అర్జున్ సినిమా ఎన్టీఆర్ ‘దేవర’ రిజల్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంది. సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్పిరిట్ అయిపోయాకే ఉండబోతుంది. అప్పటివరకూ అల్లు అర్జున్ సైలెంట్ గా ఉండడమనేది కష్టమైన పనే.
ఇలాంటి సమయంలో సుకుమార్ ఇచ్చిన ఇంపాక్ట్ ని కంటిన్యు చేయాలి అంటే సుకుమార్ స్థాయి దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చెయ్యాల్సిందే. ఈ లెక్క పర్ఫెక్ట్ గా తెలుసు కాబట్టే అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడో సినిమా వచ్చాయి. మూడు సినిమాలు సూపర్ హిట్స్ ఇచ్చి హ్యాట్రిక్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ లు అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పటివరకు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రీజనల్ మార్కెట్ ని మాత్రమే పరిమితం అయ్యాయి. ఈసారి మాత్రం రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చెయ్యడానికి బన్నీ-త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ కాంబోలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. పుష్ప 2 అయిపోగానే స్టార్ట్ అవ్వనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే బయటకి రానుంది.
Also Read
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!