HBD Rashmika Mandanna : భలేగా అలరిస్తోన్న రశ్మికా మందన్న!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్టుగా అందాల భామ రశ్మికా మందన్న చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది. కానీ, ఆమె కూత, రాత, చేత అన్నీ మోత మోగిస్తున్నాయి. కన్నడనాట విరిసిన రశ్మిక తెలుగు చిత్రసీమలో భలేగా సందడి చేస్తోంది. తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తన జిలుగు ప్రదర్శించే ప్రయత్నంలో ఉంది.
రశ్మికా మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జన్మించింది. బెంగళూరులోని ఎమ్.ఎస్. రామయ్య ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్ లో సైకాలజీ, జర్నలిజమ్, ఇంగ్లిష్ లిటిరేచర్ లో డిగ్రీ చేసింది రశ్మిక. చదువు కొనే రోజుల్లోనే రశ్మిక చలాకీ తనం ఎందరినో ఆకర్షించసాగింది. రశ్మిక సైతం తన దరికి చేరిన కొత్తదనాన్ని ఆస్వాదించే ప్రయత్నంలో పరుగులు తీసేది. అలా చదువు పూర్తి కాగానే ఇలా సినిమాల్లో నటించే అవకాశం రశ్మిక తలుపు తట్టింది. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది రశ్మిక. ఈ సినిమాలో రశ్మిక నటన జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రశ్మిక డేటింగ్ మొదలెట్టింది. ఇరువైపుల వారు వారి వివాహానికి అంగీకరించారు. దాంతో రక్షిత్, రశ్మిక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే రశ్మికకు అదే సమయంలో నటిగా మంచి అవకాశాలు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
Also Read
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
- Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
- SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
తెలుగులో నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో అడుగు పెట్టింది రశ్మిక. తరువాత ఆమె, విజయ్ దేవరకొండతో కలసి ‘గీత గోవిందం’లో నటించింది. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ పై ‘దేవ్ దాస్’లో నాని సరసన, ‘డియర్ కామ్రేడ్’లో మరోమారు విజయ్ తోనూ, ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబుకు జోడీగా, ‘భీష్మ’లో నితిన్ కు నాయికగా నటించిన రశ్మిక ‘పుష్ప’లో అల్లు అర్జున్ జంటగా భలే కనువిందు చేసింది. శర్వానంద్ తో రశ్మిక నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఈ యేడాది విడుదలైంది. అయితే అంతగా ఆకట్టుకోలేక పోయింది. రశ్మిక ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తోంది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన ‘మిషన్ మజ్ను’లో అభినయిస్తోంది. అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న ‘గుడ్ బై’ అనే హిందీ సినిమాలోనూ రశ్మిక కీలక పాత్రలో కనిపించనుంది. అనేక సార్లు సైమా అవార్డుల్లో రశ్మిక ఉత్తమ నటిగా సందడి చేయడం విశేషం! అనతి కాలంలోనే అందరినీ అలరిస్తూ ఆకట్టుకుంటున్న రశ్మిక మునుముందు ఏ యే భాషల్లో సందడి చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!