Gunasekhar : వైవిధ్యమే గుణశేఖరుని ఆయుధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేరుకు తగ్గట్టే గుణశేఖర్ ఓ ప్రత్యేకమైన గుణమున్న దర్శకుడు. సక్సెస్ కోసం పరుగులు తీయరు. అలాగని కమర్షియల్ ఫార్ములానూ వీడరు. చిత్రసీమలో దాదాపు మూడు దశాబ్దాల నుంచీ దర్శకునిగా ఉన్నా, గుణశేఖర్ తీసింది పట్టుమని పన్నెండు సినిమాలే! అయినా వాటిలో అన్నిటా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నమే చేశారు గుణశేఖర్.
గుణశేఖర్ 1964 జూన్ 2న అనకాపల్లి సమీపంలోని నర్సీపట్నంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చెన్నపట్నం చేరారు. డి.వి.నరసరాజు, క్రాంతికుమార్, రామ్ గోపాల్ వర్మ వంటి వారి వద్ద అసోసియేట్ గా పనిచేశారు గుణశేఖర్. తొలి చిత్రం ‘లాఠీ’తోనే దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్నారు. రెండో సినిమా ‘సొగసు చూడతరమా’తోనూ ఆకట్టుకోగలిగారు. మూడో చిత్రం ‘రామాయణం’లో అందరూ బాలలతో ఓ ప్రయోగం చేశారు. అందుకు నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి సాహసం కూడా తోడయింది. ఆ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది.
Also Read
మూడు చిత్రాలతోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్న గుణశేఖర్ కు చిరంజీవి ‘చూడాలనివుంది’ అసలు సిసలు ఘనవిజయాన్ని చూపించింది. తరువాత కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ‘మనోహరం’ మనసులను అంతగా హరించలేకపోయింది. ‘మృగరాజు’ సరిగా గర్జించలేకపోయాడు. అప్పుడు మహేశ్ తో ‘ఒక్కడు’ తీసి మురిపించారు గుణశేఖర్. మహేశ్ కెరీర్ లో ‘ఒక్కడు’ తొలి గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. ఆ నమ్మకంతోనే గుణశేఖర్ తో ‘అర్జున్’గానూ, ‘సైనికుడు’గానూ సాగారు మహేశ్. అయితే అవి ‘ఒక్కడు’లా మురిపించలేకపోయాయి. ‘వరుడు’ వివాహమహోత్సం చూపించాడే కానీ, విజయోత్సవం కలిగించలేకపోయాడు. తరువాత ‘నిప్పు’ అని తెలిసీ పట్టుకుంటే కాలింది. ‘రుద్రమదేవి’కి అసలు సిసలు బంగారు ఆభరణాలు అలంకరించారు గుణశేఖర్. ఈ చారిత్రకం ఆయనకు ఏ మాత్రం లాభించలేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత ఇప్పుడు ‘శాకుంతలం’ అనే పౌరాణికంపై దృష్టి సారించారు గుణశేఖర్. సమంత శకుంతలగా నటిస్తోన్న ‘శాకుంతలం’పై గుణశేఖర్ కు భారీ అంచనాలే ఉన్నాయి. ఆ తరువాత రానాతో ‘హిరణ్య కశ్యప’ కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు గుణశేఖర్. పౌరాణిక చిత్రం ‘రామాయణం’తో నేషనల్ అవార్డు సంపాదించిన గుణశేఖర్ మళ్ళీ ఇన్నాళ్ళకు పౌరాణికాలపైనే దృష్టి సారిస్తున్నారంటే ఆయన ఏదో చెయ్యబోతున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారయినా గుణశేఖర్ కోరుకుంటున్న విజయం ఆయన దరి చేరాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..