Gunasekhar : వైవిధ్యమే గుణశేఖరుని ఆయుధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేరుకు తగ్గట్టే గుణశేఖర్ ఓ ప్రత్యేకమైన గుణమున్న దర్శకుడు. సక్సెస్ కోసం పరుగులు తీయరు. అలాగని కమర్షియల్ ఫార్ములానూ వీడరు. చిత్రసీమలో దాదాపు మూడు దశాబ్దాల నుంచీ దర్శకునిగా ఉన్నా, గుణశేఖర్ తీసింది పట్టుమని పన్నెండు సినిమాలే! అయినా వాటిలో అన్నిటా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నమే చేశారు గుణశేఖర్.
గుణశేఖర్ 1964 జూన్ 2న అనకాపల్లి సమీపంలోని నర్సీపట్నంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చెన్నపట్నం చేరారు. డి.వి.నరసరాజు, క్రాంతికుమార్, రామ్ గోపాల్ వర్మ వంటి వారి వద్ద అసోసియేట్ గా పనిచేశారు గుణశేఖర్. తొలి చిత్రం ‘లాఠీ’తోనే దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్నారు. రెండో సినిమా ‘సొగసు చూడతరమా’తోనూ ఆకట్టుకోగలిగారు. మూడో చిత్రం ‘రామాయణం’లో అందరూ బాలలతో ఓ ప్రయోగం చేశారు. అందుకు నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి సాహసం కూడా తోడయింది. ఆ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది.
Also Read
- Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
- The Odyssey: 'ది ఒడిస్సీ' ప్రీ రివ్యూ ..
- The Odyssey: రిలీజ్కు ముందే సెన్సేషన్.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న 'ది ఒడిస్సీ' టికెట్లు! లక్షకు పైగా..
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
మూడు చిత్రాలతోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్న గుణశేఖర్ కు చిరంజీవి ‘చూడాలనివుంది’ అసలు సిసలు ఘనవిజయాన్ని చూపించింది. తరువాత కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ‘మనోహరం’ మనసులను అంతగా హరించలేకపోయింది. ‘మృగరాజు’ సరిగా గర్జించలేకపోయాడు. అప్పుడు మహేశ్ తో ‘ఒక్కడు’ తీసి మురిపించారు గుణశేఖర్. మహేశ్ కెరీర్ లో ‘ఒక్కడు’ తొలి గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. ఆ నమ్మకంతోనే గుణశేఖర్ తో ‘అర్జున్’గానూ, ‘సైనికుడు’గానూ సాగారు మహేశ్. అయితే అవి ‘ఒక్కడు’లా మురిపించలేకపోయాయి. ‘వరుడు’ వివాహమహోత్సం చూపించాడే కానీ, విజయోత్సవం కలిగించలేకపోయాడు. తరువాత ‘నిప్పు’ అని తెలిసీ పట్టుకుంటే కాలింది. ‘రుద్రమదేవి’కి అసలు సిసలు బంగారు ఆభరణాలు అలంకరించారు గుణశేఖర్. ఈ చారిత్రకం ఆయనకు ఏ మాత్రం లాభించలేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత ఇప్పుడు ‘శాకుంతలం’ అనే పౌరాణికంపై దృష్టి సారించారు గుణశేఖర్. సమంత శకుంతలగా నటిస్తోన్న ‘శాకుంతలం’పై గుణశేఖర్ కు భారీ అంచనాలే ఉన్నాయి. ఆ తరువాత రానాతో ‘హిరణ్య కశ్యప’ కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు గుణశేఖర్. పౌరాణిక చిత్రం ‘రామాయణం’తో నేషనల్ అవార్డు సంపాదించిన గుణశేఖర్ మళ్ళీ ఇన్నాళ్ళకు పౌరాణికాలపైనే దృష్టి సారిస్తున్నారంటే ఆయన ఏదో చెయ్యబోతున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారయినా గుణశేఖర్ కోరుకుంటున్న విజయం ఆయన దరి చేరాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!