ట్రైలర్ అద్దిరిపోయింది అని ప్రభాస్ అన్నాడు : గోపీచంద్
హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రోజు సీటీమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రభాస్ నాకు ఫోన్ చేసి ట్రైలర్ అద్దిరిపోయింది అని చెప్పాడు. అయితే ఈ సినిమా 2019 లో ప్రారంభించగా కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా పక్క మాస్, కమర్షియల్ సినిమా. మణిశర్మతో నేను చేసిన సినిమాలో దాదాపు అన్ని హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలు కూడా చాలా కష్టపడ్డారు అని తెలిపారు. ఇక దర్శకుడు సంపత్ నందికి ఈ సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పారు గోపీచంద్. అయితే ఈ సినిమాలో భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తుండగా… సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది.
Also Read
తాజావార్తలు
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
-
UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!