ఆఫ్ఘన్ కాందిశీకుల వెతలపై ‘గార్డ్’ చిత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా ‘అటాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న అజయ్ కపూర్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. సుభాష్ కాలేతో కలిసి భారీ స్థాయిలో ‘గార్డ్’ మూవీని నిర్మించబోతున్నాడు. ఆఫ్ఘన్ కాందిశీకుల వేతల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ ప్రకటనతో పాటు నిర్మాతలు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పరమాణు’, ‘రోమియో అక్బర్ వాల్తేర్’, ‘బేబీ’, ‘ఎయిర్ లిఫ్ట్’ తర్వాత ఆ తరహాలోనే ‘అటాక్’, ‘గార్డ్’ చిత్రాలను అజయ్ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక సుభాష్ కాలేతో కలిసి ‘రాయ్’, ‘ఆల్ ఈజ్ వెల్’ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘గార్డ్’ కోసం జత కట్టడం విశేషం.
Read Also : బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
‘గార్డ్’ మూవీ గురించి అజయ్ కపూర్ మాట్లాడుతూ, ”సుభాష్, నేను కలిసి కొన్నేళ్ళుగా ప్రయాణం సాగిస్తున్నాం. అతను ఇటీవల ‘గార్డ్’ స్క్రిప్ట్ చెప్పగానే నాకు నచ్చేసింది. వెంటనే అంగీకారాన్ని తెలిపాను. ఈ కథలో భావోద్వేగాలతో పాటు దేశభక్తి పూరితమైన అంశాలు, స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉన్నాయి. ఈ కథకు సంపూర్ణ న్యాయం చేకూర్చడం కోసం ఈ సినిమాను భారీగా ప్లాన్ చేశాం” అని అన్నారు. మరో నిర్మాత సుభాష్ కాలే మాట్లాడుతూ, ”’గార్డ్’ నాకు వెరీ స్పెషల్ ప్రాజెక్ట్. ఈ కథ మీద కొంతకాలంగా వర్క్ చేస్తూ ఉన్నాను. దీనికి అజయ్ కపూర్ లాంటి నిర్మాత సాయం దొరకడం ఆనందంగా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను అంతర్జాతీయ స్థాయిలో తెరపై చూపించాలన్నది మా కోరిక’ అని అన్నారు.
ఈ చిత్రం కోసం ‘మేరా భారత్ హై మహాన్’ అంటూ ఓ నేపథ్య గీతాన్ని ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ‘మిషన్ మంగళ్’కు రచన చేసిన నిధి సింగ్ ధర్మా వర్క్ చేశారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులతో పాటు దర్శకుడి వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది ఆగస్ట్ 15న విడుదల స్వాతంత్రదినోత్సవ కానుకగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
-
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
-
PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!