మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ నిరాశను మిగిల్చింది.
కానీ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్ ను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచుకున్న గేమ్ ఛేంజర్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. అయితే గేమ్ ఛేంజర్ ఓటీటీలో ఈ సినిమాను అదనపు నిడివితో రిలీజ్ చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ అమెజాన్ ప్రైమ్ వారికీ షాక్ ఇస్తూ థియేట్రికల్ వర్షన్ 2 గంటల 38 నిమిషాలు వర్షన్ ను మాత్రమే ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసింది. మరోవైపు రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబుసన డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాను శరవేగంగా చేస్తున్నాడు రామ్ చరణ్.