Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Forth Years For Idi Pellantara Movie

Chiranjeevi : నలభై ఏళ్ళ ‘ఇది పెళ్ళంటారా?’

Published Date :July 16, 2022 , 6:43 am
By Subbarao N
Chiranjeevi : నలభై ఏళ్ళ ‘ఇది పెళ్ళంటారా?’
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

మెగాస్టార్ చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఆయనకు అచ్చివచ్చిన నాయికలు మాధవి, రాధిక అనే చెప్పాలి. చిరంజీవి, రాధికతో ‘న్యాయం కావాలి’ చిత్రం నిర్మించిన క్రాంతి కుమార్, ఆ తరువాత వారిద్దరితోనే ‘కిరాయి రౌడీలు’, ‘ఇది పెళ్ళంటారా?’ తెరకెక్కించారు. ‘న్యాయంకావాలి’ సూపర్ హిట్ కాగా, ‘కిరాయి రౌడీలు’ హిట్ అనిపించుకుంది. ‘న్యాయం కావాలి’లో లాగే ‘ఇది పెళ్ళంటారా?’లోని కథాంశం కూడా మహిళా సమస్యపైనే రూపొందింది. 1982 జూలై 16న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.

‘ఇది పెళ్ళంటారా?’ టైటిల్ ను బట్టే, ఒకరికి జరిగిన పెళ్ళి సరైనది కాదని తెలుస్తోంది. ఇక అసలు కథ ఏమిటంటే – రాధ, పుణ్యమూర్తి భార్య. అతను భర్తననే అహంకారంతో ఆమెను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే, వాడు కట్టిన తాళిని తెంచేసి, చనిపోవాలనుకుంటుంది. అయితే ‘వెలుగు’ పత్రిక పబ్లిషర్ జగన్నాథం ఆమెను రక్షించి, ఇంటికి తీసుకువెళతాడు. ఆయనకు తన కథ చెప్పుకుంటుంది రాధ. ఆమె మనసును మళ్ళించడానికి అన్నట్టు జగన్నాథం, తన దగ్గర పనిచేసే దీపక్ తో రాధను కూడా ఇంటర్వ్యూస్ చేయడానికి పంపిస్తూ ఉంటాడు. ఆడది అబల కాదు అని నమ్మి, మొగుడు లేకపోయినా బతకవచ్చు అని భావించే సువర్ణ ఇంటర్వ్యూతో రాధ, దీపక్ ముందుకు సాగుతారు. కొన్నాళ్ళకు దీపక్, రాధను పెళ్ళి చేసుకుంటానంటాడు. అందుకు జగన్నాథం కూడా చేసుకోమని చెబుతాడు. దీపక్, రాధ పెళ్ళవుతుంది. హాయిగా కాపురం చేసుకుంటూ ఉండగా, రాధ మొదటి మొగుడు పుణ్యమూర్తి వచ్చి, చిచ్చు పెడతాడు. తనతో రాధ పెళ్ళి ఫోటోలు చూపించి, దీపక్ ఆఫీసులో నానా యాగీ చేస్తాడు. దీపక్ వాడికి దేహశుద్ధి చేస్తాడు. తరువాత రాధకు తన వల్ల ఓ బిడ్డ పుట్టిందని, ఆ పాపను చూడాలని లేదా అంటూ ఆమెనూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ పాప ఆ నాడే చచ్చిపోయిందని అన్నా, లేదు ఉందని అంటాడు. ఆ పాపను అడ్డు పెట్టుకొని దీపక్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. పైగా రాధను నానా మాటలు అంటాడు. దాంతో పుణ్యమూర్తిని చంపబోతుంది రాధ. కోర్టులో రాధ కథ విన్న న్యాయమూర్తి, అసలు ఆమెకు పుణ్యమూర్తితో జరిగిన పెళ్ళి పెళ్ళే కాదని, ఆ పరిస్థితుల్లో ఏ ఆడదైనా అలాగే ప్రవర్తిస్తుందని తీర్పునిస్తాడు. పుణ్యమూర్తిని జనం చితక్కొడతారు. పాప, రాధను దీపక్ ఆదరించడంతో కథ సుఖాంతమవుతుంది.

Also Read

  • Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
  • Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!
  • Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!
  • TheyCallHimOG2 : OG -2.. నిర్మాణ భాద్యతలు ఆ రెండు సంస్థలకు?
Add as a preferred
source on google

అంతకు ముందు ‘అన్నపూర్ణ ఇంటర్నేషనల్స్’ పతాకంపై చిత్రాలు నిర్మించిన క్రాంతికుమార్, ‘న్యాయం కావాలి’ మొదలు ‘శ్రీక్రాంతి చిత్ర’ పతాకంపై సినిమాలు నిర్మించసాగారు. ఆ బ్యానర్ పైనే ఈ సినిమా కూడా రూపొందింది. ఇందులో గొల్లపూడి మారుతీరావు, ప్రభాకర్ రెడ్డి, వుయ్యూరు రామకృష్ణ, సువర్ణ, ఝాన్సీ, పి.జె.శర్మ, చలపతిరావు, భానోజీరావు, మల్లికార్జునరావు, డాక్టర్ భాస్కరరావు నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా, పాటలు వేటూరి పలికించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులోని “హరి నారాయణ… హరి నారాయణ…”, “వసంతం… శరత్తు…హేమంతం…”, “అమ్మగా…నాన్నగా…”, “నా ఊపిరి నీ పరిమళమా…” అంటూ సాగే పాటలు అలరించాయి.

ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య కో-డైరెక్టర్ గా పనిచేశారు. చిరంజీవి, రాధిక నటించిన నాల్గవ చిత్రమిది. క్రాంతికుమార్ నిర్మించిన చిత్రాల్లో వారిద్దరూ నటించిన మూడవ సినిమా ఇది. మధ్యలో ‘ప్రియ’ అనే చిత్రంలోనూ నటించారు. అంతకు ముందు వారమే విడుదలైన యన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ వేవ్ లో ఈ సినిమా ఆట్టే జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత ఈ తరహా కథలతో పలు సినిమాలు తెరకెక్కాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • D. Vijaya Bhaskar
  • Idi Pellantara
  • Kranthi Kumar.
  • Raadhika

తాజావార్తలు

  • Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?

  • Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!

  • Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!

  • Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!

  • Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions