Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Fifty Five Years Forbhama Vijayam

NTR: యాభై ఐదేళ్ళ ‘భామా విజయం’

Published Date :June 29, 2022 , 6:45 am
By Subbarao N
NTR: యాభై ఐదేళ్ళ ‘భామా విజయం’
  • Follow Us :
  • google news
  • dailyhunt

కథలు కొత్తవి కనిపించక పోతే, పాత కథలనే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అలా తెలుగు చిత్రసీమలో పలు పాత కథలే కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాయి. వాటిలో కొన్ని ఘనవిజయాలు సైతం సాధించాయి. తన చిత్రాలనే మళ్ళీ కాలానుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి ప్రేక్షకులను రంజింప చేశారు దిగ్దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య. 1934లో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ తెలుగు చిత్రసీమలో తొలి బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమానే మరో 29 ఏళ్ళకు అదే సి.పుల్లయ్య 1963లో రంగుల ‘లవకుశ’గా తీర్చిదిద్ది, అనూహ్య విజయం సాధించారు. ‘లవకుశ’ స్థాయిలో ఇప్పటి దాకా దక్షిణాదిన ఘనవిజయం సాధించిన పౌరాణికం మరొకటి కానరాదు. అదే తీరున తాను 1947లో రూపొందించిన ‘గొల్లభామ’ చిత్రాన్ని మరో ఇరవై ఏళ్ళ తరువాత ‘భామావిజయం’గా మలచి జనాన్ని ఆకట్టుకున్నారు సి.పుల్లయ్య. చిత్రమేమిటంటే, సి.పుల్లయ్య తన హిట్స్ ను రీమేక్ చేసిన ఈ రెండు చిత్రాలలో నటరత్న యన్.టి.రామారావునే కథానాయకునిగా ఎంచుకోవడం. అలా ‘బామావిజయం’లోనూ యన్టీఆర్ హీరోగా నటించారు. దేవిక నాయికగా నటించిన ఈ చిత్రం 1967 జూన్ 29న విడుదలయి విజయం సాధించింది.

సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘గొల్లభామ’లో కృష్ణవేణి నాయికగా నటించగా, ఈలపాట రఘురామయ్య ఆమెకు జోడీగా నటించారు. ఆ చిత్రంలో ప్రధాన కథ అంతా గొల్లభామపైనే తిరుగుతుంది. ‘భామావిజయం’లో కథానాయకుడు యన్టీఆర్ కావడంతో, ఆయన ప్రధానాంశంగా మారారు. కథాంశం మాత్రం ఒక్కటే! “భూపతి చంపితిన్, మగడు భూరిభుజంగము చేత చచ్చే నే – నాపద చెంది చెంది ఉదయార్కుని పట్టణమేగి, వేశ్యనై – పాపము కట్టుకొంటి, అట పట్టి విటుండైరాగచూసి, సం- తాపము చెంది అగ్ని పడి దగ్ధముగా కిటు గొల్లభామనై – ఈ పని కొప్పుకొంటి నృపతీ వగపేటికి చల్లచిందినన్’’- ఈ ‘భామావిజయం’ కథ మొత్తం ఈ పద్యంలోనే దాగి ఉంది. ఓ గురువు, ఆయన శిష్యుడు బడలిక తీర్చుకోవడానికి ఓ వటవృక్షం దగ్గర సేదతీరుతారు. అక్కడే ఓ గొల్లభామ బొమ్మ చెక్కి, దాని కింద పైన ఉదహరించిన పద్యం చెక్కబడి ఉంటుంది. దానిని చదివిన శిష్యుడు, ఆ కథ ఏమిటో చెప్పమంటాడు. అందుకు గురువు సావధానంగా చెప్పడంతో ‘భామావిజయం’ కథ మన కళ్ళ ముందు నిలుస్తుంది.

Also Read

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
  • JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
  • Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!

సుందరి అనే అందమైన అడవిపిల్లను భూపతి చెరచబోతాడు. వాడిని చంపి పారిపోతున్న సుందరిని జయచంద్రుడనే రాజకుమారుడు రక్షిస్తాడు. ఆమె అందచందాలకు జయచంద్రుడు సైతం ఆకర్షితుడై, ప్రేమిస్తాడు. సుందరి సైతం జయచంద్రుని ఆరాధిస్తుంది. జయచంద్రుడు తన కన్నవారికి సుందరి కథ చెప్పి, ఆమెను వారి అంగీకారంతో వివాహమాడతాడు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న సమయంలో మోహినీ, వాహినీ అనే దేవకన్యలు జయచంద్రుని అందం చూసి మత్తెక్కి అతడు నిద్రిస్తూండగా తమ దేవలోకం తీసుకు వెళతారు. అక్కడ వారి అందచందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ, సుందరిని తప్ప అన్యమెరుగనని చెప్పగా, సుందరిని సైతం అక్కడకు తెస్తారు. భార్యాభర్తలిద్దరూ అమృతం సేవించి, ఆనందంగా జీవనం సాగిస్తారు. తరువాత సుందరిని భూలోకం పంపి, మోహిని తన ఆటపాటలతో జయచంద్రుని వశం చేసుకుంటుంది. భూలోకంలో భర్తలేకుండా తల్లి అయిన సుందరిని అందరూ అనుమానిస్తారు. ఆమెకు రాజు శిరచ్ఛేదం విధిస్తాడు. ఆమె అమృతం తాగడం వల్ల కత్తులు ఏమీ చేయలేవు. దాంతో భటులు ఆమెను పతివ్రతగా భావించి, అడవిలో వదిలేస్తారు. అక్కడ నుంచీ సుందరి పలు కష్టాలు పడుతుంది. ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ తప్పిపోయి, ఓ రాజదంపతులకు లభిస్తాడు. తరువాత ఓ వేశ్య గృహంలో తలదాచుకుంటుంది సుందరి. ఎన్నో ఏళ్ళు గడచినా, సుందరి తన వ్రతభంగం కాకుండా వేశ్య ఇంటనే పవిత్రంగా ఉంటుంది. అయితే కొన్నేళ్ళ తరువాత రాజ దంపతుల వద్ద పెరిగిన ఆమె కొడుకే నవయువకుడై ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. రాకుమారుని మిత్రుడు వేశ్య గృహానికి వెళ్ళి, ఎలాగైనా ఆమెను ఒప్పించి, తమ రాజకుమారునికి అప్పగించమంటాడు. భయపడ్డ వేశ్య, సుందరికి ఈ విషయం చెబుతుంది. ఎలాగైనా ఇన్నాళ్ళు నీకు రక్షణ ఇచ్చిన మమ్మల్ని కాపాడమంటుంది. ఆమె సరే అంటుంది. సాయంకాలం రాకుమారుడు వస్తూ, దారిలో ఓ దూడ తోక తొక్కుతాడు. ఆ రాకుమారునికి పలు భాషలు తెలుసు. అలాగే జంతు భాష కూడా వచ్చి ఉంటుంది. గోవు, దూడ మాటల్లో ఆ వేశ్య ఇంట ఉన్న ఆమెనే తన తల్లి అని తెలుసుకుంటాడు. ఆమెను ‘అమ్మా’ అనగానే సుందరి యెద పొంగి తల్లిప్రేమ చిలుకుతుంది. వేశ్య, సుందరి మోసం చేసిందని భావిస్తుంది. ఆ ఇంట నుండి బయట పడ్డ సుందరి ఓ గొల్లవారి ఇంట తలదాచుకుంటుంది. నెత్తిన పాలు, పెరుగు, నెయ్యి పెట్టుకొని అమ్మబోతుంది. ఆ సమయంలోనే ఆమె కొడుకు ఆమెను వెదుక్కుంటూ వస్తాడు. దేవలోకంలోని జయచంద్రునికి కూడా భార్య గుర్తుకు వస్తుంది. మోహిని, వాహిని మధ్య వైరం తలెత్తడం వల్ల అతణ్ణి భార్య దగ్గరకు వెళ్ళమని వాహిని పంపిస్తుంది. ఇంటికి వచ్చిన జయచంద్రుని చూసి అందరూ జడుసుకుంటారు. ఎందుకంటే, అతనిలో ఏ మార్పూ ఉండదు. అందరూ ముసలివారై పోయి ఉంటారు. తన భార్య ఏదని అడుగుతాడు. అందుకు జరిగిన దంతా చెబుతారు. ఆమె అమృతం తాగి ఉంది కనుక, చావు ఉండదని జయచంద్రుడు కూడా ఆమెను వెదుక్కుంటూ వెడతాడు. జయచంద్రుని గుర్రం కింద పడుతుంది సుందరి, ఎవరు నీవు అని అతడు ప్రశ్నించగా, “భూపతి చంపితి…” పద్యం పాడుతుంది. కథంతా విన్న జయచంద్రుడు ఆమె ముఖం అప్పుడు చూస్తాడు. ఆమె తన భార్యేఅని గుర్తిస్తాడు. అలాగే రాకుమారుడు కూడా వచ్చి, తన తల్లిదండ్రులను చేరుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో ఎల్.విజయలక్ష్మి, విజయనిర్మల, రేలంగి, గిరిజ, రాజనాల, ముక్కామల, చిత్తూరు నాగయ్య, చదలవాడ, రాజబాబు, నాగరాజు, ఎస్.వరలక్ష్మి, ఋష్యేంద్రమణి నటించారు. ఈ చిత్రానికి టి.వి.రాజు సంగీతం సమకూర్చగా, సముద్రాల, సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. ఇందులోని “పైరుగాలి వీచింది…”, “రా రా సుందరా…”, “రెండు చందమామలు…”, “రావే చెలీ ఓ జాబిలీ…”, “భువన మోహిని…”, “కోరినవాడే చెలీ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి, శతదినోత్సవం జరుపుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhama Vijayam
  • C. Pullaiah
  • Devika
  • N. T. Rama Rao
  • Samudrala Jr.

తాజావార్తలు

  • West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్‌కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్‌లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions