‘Dahini: The Witch’: ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జేడి చక్రవర్తికి అవార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
J.D. Chakravarthy: మన చిత్రాలు, మన నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. దేశవిదేశాల్లోని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో మన చిత్రాలు ప్రదర్శితమౌతున్నాయి. తాజాగా నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన హీరో జేడీ చక్రవర్తికి అవార్డు లభించింది. జేడీ చక్రవర్తి హీరోగా, విలన్గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన అవార్డు లభించింది. ‘దహిణి : ది విచ్’ అనే సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా జేడీ చక్రవర్తికి ఈ అవార్డు లభించింది. దీంతో అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జేడీ చక్రవర్తికి ఈ గుర్తింపు లభించడంతో ఆయన అభిమానులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముందు ఆస్ట్రేలియాలోనూ ‘దహిణి : ది విచ్’ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాజేశ్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రవి పున్నం సంభాషణలు రాశారు. ఇప్పటి వరకూ 18 అంతర్జాతీయ అవార్డులను ఈ సినిమా అందుకుంది.
Also Read
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!