అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబో ఎలా ఉండాలి? అదిరిపోయేలా ఉండాలి, గతంలో బాకీ పడిన హిట్ ని సాలిడ్ గా కొట్టేలా ఉండాలి. అందుకే ప్రయోగాలకి పోకుండా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా SSMB 28ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ బాక్సాఫీస్ను షేక్ చేసేలా సంకేతం ఇచ్చేసింది. మిర్చి యార్డులో బీడితో నడిచి వస్తున్న మహేష్ ఫోటో SSMB 28 సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ షెడ్యూల్లో మిర్చి యార్డులో భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న ఎస్ఎస్ఎంబీ 28 రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వైరల్ అవుతున్న ఆ రూమర్ వింటేనే SSMB 28 సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు పీక్స్కు వెళ్తాయి. ఈ మోస్ట్ అవైటింగ్ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడట. అది కూడా తండ్రీ కొడుకులుగా మహేశ్ నటిస్తున్నాడట. తండ్రిగా మహేష్ గెటప్ ఓ రేంజ్లో ఉంటుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్గా మారింది. ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఫాదర్ రోల్ రివీల్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఈ పుకార్లు ఫ్యాన్స్కు ఎగ్జైటింగ్గా మారాయి. మహేష్ డబుల్ రోల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా తెరపై ఒక మహేశ్ బాబు కనిపిస్తే ఘట్టమనేని అభిమానులు బాక్సాఫీస్ లెక్కలు మారుస్తారు, అలాంటిది ఇక ఇద్దరు మహేశ్ బాబులు కనిపిస్తే దాని ఇంపాక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ న్యూస్ జస్ట్ రూమర్ గా మాత్రమే ఉంటుందా లేక మహేశ్ నిజంగానే డ్యూయల్ రోల్ లో SSMB 28 సినిమా చేస్తున్నాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.