Dharmakshetram: 30 ఏళ్ళ ‘ధర్మక్షేత్రం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఒకప్పుడు బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్ విశేషాదరణ చూరగొంది. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు ‘రక్తాభిషేకం’ చిత్రం నిర్మించి, విజయం సాధించిన ‘శ్రీ రాజీవ ప్రొడక్షన్స్’ అధినేత కె.సి.రెడ్డి నిర్మించిన రెండవ చిత్రం ‘ధర్మక్షేత్రం’. ‘రక్తాభిషేకం’ను మ్యూజికల్ హిట్ గా నిలిపిన ఇళయరాజా, ఈ చిత్రానికి కూడా స్వరకల్పన చేసి, దీనిని మ్యూజికల్ హిట్ గా మలిచారు. 1992 ఫిబ్రవరి 14న ‘ధర్మక్షేత్రం’ జనం ముందు నిలచింది.
‘ధర్మక్షేత్రం’ కథ విషయానికి వస్తే – ఇందులో కథానాయకుడు బెనర్జీ చట్టం, ధర్మం, న్యాయం అన్నవి సామాన్యులను, అమాయకులను కాపాడడానికే అని నమ్ముతూ ఉంటాడు. దానిని తు.చ. తప్పక పాటిస్తూ ఉంటాడు. ఆ నగరంలో దుర్గ, పాండు అనే ఇద్దరు రౌడీల కారణంగా అమాయకులు బలి అవుతూ ఉంటారు. ఆ విషయం తెలిసినా, వారికి ఉన్న రాజకీయ అండదండలకు భయపడి ఎవరూ ఏమి చేయలేరు. జడ్జి సైతం నిస్సహాయంగా ఉంటారు. ఆ సమయంలో బెనర్జీ న్యాయాన్ని పరిరక్షిస్తూనే, ఆ నీచులను అంతమొందిస్తాడు. దుర్గ, పాండు కారణంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినా, వారిని రక్షించడానికే పూనుకున్న న్యాయవాదులు, బెనర్జీ వారిని హత్య చేయగానే, అతణ్ణి దోషిగా చూపి శిక్షించమని వాదిస్తారు. దాంతో బెనర్జీ కోర్టులో ధర్మాన్ని రక్షించడానికి తన లాంటి ఓ ప్రాణం పోయినా, లక్షలాది ప్రాణాలు స్వేచ్ఛగా జీవిస్తాయని చెబుతాడు. తనకు ఏ శిక్ష విధించినా ఆనందంగా అనుభవించడానికి సిద్ధమేనని అంటాడు. దాంతో కథ ముగుస్తుంది.
Also Read
- Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
- National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
- July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
- Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
ఇందులో బెనర్జీగా బాలకృష్ణ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. దివ్యభారతి నాయికగా నటించింది. మిగిలిన పాత్రల్లో జగ్గయ్య, రామిరెడ్డి, దేవన్, నాజర్, శ్రీహరి, బ్రహ్మాజీ, సాక్షి రంగారావు, ప్రసన్న కుమార్, పోసాని కృష్ణమురళి, జయలలిత, జ్యోతి, సుధారాణి, రాధాబాయి నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ సమకూర్చగా, వేటూరి, సిరివెన్నెల పాటలు పలికించారు.
ఇళయరాజా బాణీల్లో రూపొందిన ఆరు పాటలూ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. “ఎన్నో రాత్రులొస్తాయి కానీ…”, “చెలి నడుమే అందం…”, “ముద్దులతో శృంగార బీటు…”, “కొరమీను కోమలం…సొరచేప శోభనం…” పాటలను వేటూరి రాయగా, “అరె ఇంకా జెంకా…”, ” పెళ్ళికి ముందు ఒక్కసారి…” పాటలను సిరివెన్నెల అందించారు. సినిమా విడుదలకు ముందే సంగీతం పరంగా అభిమానులను విశేషంగా అలరించింది ఈ చిత్రం. దాంతో ‘ధర్మక్షేత్రం’కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తరువాత అంతగా అలరించలేక పోయిందీ సినిమా.
తాజావార్తలు
-
Keeway Hypvolt-R: భారత్లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
-
Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!