Dharmakshetram: 30 ఏళ్ళ ‘ధర్మక్షేత్రం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఒకప్పుడు బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్ విశేషాదరణ చూరగొంది. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు ‘రక్తాభిషేకం’ చిత్రం నిర్మించి, విజయం సాధించిన ‘శ్రీ రాజీవ ప్రొడక్షన్స్’ అధినేత కె.సి.రెడ్డి నిర్మించిన రెండవ చిత్రం ‘ధర్మక్షేత్రం’. ‘రక్తాభిషేకం’ను మ్యూజికల్ హిట్ గా నిలిపిన ఇళయరాజా, ఈ చిత్రానికి కూడా స్వరకల్పన చేసి, దీనిని మ్యూజికల్ హిట్ గా మలిచారు. 1992 ఫిబ్రవరి 14న ‘ధర్మక్షేత్రం’ జనం ముందు నిలచింది.
‘ధర్మక్షేత్రం’ కథ విషయానికి వస్తే – ఇందులో కథానాయకుడు బెనర్జీ చట్టం, ధర్మం, న్యాయం అన్నవి సామాన్యులను, అమాయకులను కాపాడడానికే అని నమ్ముతూ ఉంటాడు. దానిని తు.చ. తప్పక పాటిస్తూ ఉంటాడు. ఆ నగరంలో దుర్గ, పాండు అనే ఇద్దరు రౌడీల కారణంగా అమాయకులు బలి అవుతూ ఉంటారు. ఆ విషయం తెలిసినా, వారికి ఉన్న రాజకీయ అండదండలకు భయపడి ఎవరూ ఏమి చేయలేరు. జడ్జి సైతం నిస్సహాయంగా ఉంటారు. ఆ సమయంలో బెనర్జీ న్యాయాన్ని పరిరక్షిస్తూనే, ఆ నీచులను అంతమొందిస్తాడు. దుర్గ, పాండు కారణంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినా, వారిని రక్షించడానికే పూనుకున్న న్యాయవాదులు, బెనర్జీ వారిని హత్య చేయగానే, అతణ్ణి దోషిగా చూపి శిక్షించమని వాదిస్తారు. దాంతో బెనర్జీ కోర్టులో ధర్మాన్ని రక్షించడానికి తన లాంటి ఓ ప్రాణం పోయినా, లక్షలాది ప్రాణాలు స్వేచ్ఛగా జీవిస్తాయని చెబుతాడు. తనకు ఏ శిక్ష విధించినా ఆనందంగా అనుభవించడానికి సిద్ధమేనని అంటాడు. దాంతో కథ ముగుస్తుంది.
Also Read
- Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్తో పరిచయం.. 'ఆది' మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
- Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
- Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
- VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
ఇందులో బెనర్జీగా బాలకృష్ణ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. దివ్యభారతి నాయికగా నటించింది. మిగిలిన పాత్రల్లో జగ్గయ్య, రామిరెడ్డి, దేవన్, నాజర్, శ్రీహరి, బ్రహ్మాజీ, సాక్షి రంగారావు, ప్రసన్న కుమార్, పోసాని కృష్ణమురళి, జయలలిత, జ్యోతి, సుధారాణి, రాధాబాయి నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ సమకూర్చగా, వేటూరి, సిరివెన్నెల పాటలు పలికించారు.
ఇళయరాజా బాణీల్లో రూపొందిన ఆరు పాటలూ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. “ఎన్నో రాత్రులొస్తాయి కానీ…”, “చెలి నడుమే అందం…”, “ముద్దులతో శృంగార బీటు…”, “కొరమీను కోమలం…సొరచేప శోభనం…” పాటలను వేటూరి రాయగా, “అరె ఇంకా జెంకా…”, ” పెళ్ళికి ముందు ఒక్కసారి…” పాటలను సిరివెన్నెల అందించారు. సినిమా విడుదలకు ముందే సంగీతం పరంగా అభిమానులను విశేషంగా అలరించింది ఈ చిత్రం. దాంతో ‘ధర్మక్షేత్రం’కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తరువాత అంతగా అలరించలేక పోయిందీ సినిమా.
తాజావార్తలు
-
APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!