Betting Promotions: బెట్టింగ్ రాయుళ్లకు పోలీసుల పిలుపు!
- బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై పోలీసుల ఫోకస్
- బెట్టింగ్ యాప్ ప్రమోషన్పై చేసిన పలువురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
- నేడు 4 గంటలకు విచారణకు తన ముందు హాజరు కావాలనివిష్ణు ప్రియకు నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కొందరి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీసులు మొత్తం 11 మంది మీద పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారని కేసు నమోదు చేశారు. హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి ప్రముఖ యూట్యూబర్ల మీద కేసు నమోదైంది. ఇక పోలీసుల విచారణలో, ఈ యూట్యూబర్లు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా బెట్టింగ్ యాప్స్ను ప్రచారం చేసి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని తప్పుడు ఆశలు రేకెత్తిస్తున్నట్లు తేలింది.
Shocking: తాగుడుకు బానిసై, అనారోగ్యం బారిన టాలీవుడ్ స్టార్ హీరో?
Also Read
ఇక బెట్టింగ్ యాప్ల ప్రమోషన్పై పంజాగుట్ట పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఈ విషయంలో భాగంగా పలువురికి నోటీసులు పంపిన పోలీసులు, విష్ణు ప్రియను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విచారణ కోసం రప్పించనున్నారు. అదే విధంగా బిగ్ బాస్ టేస్టీ తేజకు కూడా నోటీసులు అందజేసి, అతన్ని కూడా నేడు 4 గంటలకు హాజరవ్వాలని ఆదేశించారు. అయితే కొందరి మొబైల్ ఫోన్లు ఆఫ్లో ఉండటం గమనార్హం. అంతేకాక, ఈ రోజు మరికొంతమందికి నోటీసులు జారీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!