Veera Simha Reddy: భ్రమరాంబ థియేటర్ వద్ద బాలయ్య ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veera Simha Reddy: నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు రోజుల ముందే అభిమానులకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకు అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు ప్రారంభమయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఓ రేంజ్ లో సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వీరసింహారెడ్డి విడుదలైన థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. మరోవైపు భాగ్యనగరంలో పలు థియేటర్ల వద్ద అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సందడి చేశారు.
Read also: Ukraine Crisis: ఆ క్షిపణులతో ఉక్రెయిన్ ఈ ఏడాది యుద్ధంలో విజయం సాధించగలదు..
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
భ్రమరాంబ థియేటర్ హైదరాబాదీలకు చాలా పేరుంది. అభిమానులు, ప్రేక్షకులతో కలిసి వీరసింహారెడ్డి ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షించేందుకు బాలకృష్ణ భ్రమరాంబ థియేటర్కి చేరుకుని సందడి చేశారు. దీంతో.. కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల సందడి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఫైర్ క్రాకర్లు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు సందడి సృష్టించాయి. బాలయ్యబాబు, గోపీచంద్ మలినేనిలతో పాటు చిత్ర యూనిట్ అభిమానులతో కలిసి థియేటర్ వద్ద సందడి చేశారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూశారు. మరోవైపు వీరసింహారెడ్డి సినిమా కూడా అడ్వాన్స్ బుకింగ్స్లో దూసుకెళ్లింది. నిజానికి బాలయ్య సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరగడం ఇదే తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్తో హైదరాబాద్లో 11.42 లక్షలు, బెంగళూరులో 30 లక్షలు, చెన్నైలో 4 లక్షలు, వరంగల్లో 17.58 లక్షలు, ముంబైలో 1.52 లక్షల రూపాయలు సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విడుదలకు ముందు రోజు రాత్రి నుంచే బాలయ్య అభిమానులు థియేటర్ల ముందు సంబరాలు చేసుకున్నారు.
ప్రతి సీన్లోనూ, ప్రతి షార్ట్లోనూ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అభిమానులకు థియేటర్లలో ఊపునిస్తుంది. అంతేకాదు బాలయ్య – తమన్ కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ రేంజ్ లో కష్టాలు పడుతూనే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ లో బాలయ్య అభిమానులకు స్పెషల్ ట్రీట్ తీసుకొచ్చాడంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా మాస్ మొగుడు.. సుగుణసుందరి పాట ప్లే అవుతుంటే సీట్లలో కూర్చోకుండా దూకేసే అభిమానుల అరుపులతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి కలెక్షన్ల పరంగా వీరసింహారెడ్డి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో లేక బద్దలు కొడతాడో చూడాలి..?
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!