Paapam Prathap: ‘పాపం ప్రతాప్’కు సెన్సార్ షాక్: యానిమల్ వెల్ఫేర్ బోర్డు టెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ సినిమా విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. సెన్సార్ బోర్డు నుండి అభ్యంతరాలు రావడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు క్లియరెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రమోషన్స్ తో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ‘పాపం ప్రతాప్’ సినిమాకు చివరి నిమిషంలో సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి. రేపు (ఏప్రిల్ 17) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కావాల్సిన ఈ చిత్రానికి, సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో రిలీజ్ డైలమాలో పడింది. సెన్సార్ నిబంధనల ప్రకారం, సినిమాలో జంతువులను వాడుకున్నప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ‘పాపం ప్రతాప్’ టీమ్ ఈ ఎన్ఓసి సమర్పించకపోవడంతో సెన్సార్ బోర్డు తుది సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
Also Read:Roja: రోజా ఈజ్ బ్యాక్.. మళ్ళీ బుల్లితెరపై‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షురూ!
Also Read
- Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
- Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
- Kriti Sanon: 'అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు'.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
- Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
ఈరోజు సాయంత్రం నుండే ఈ సినిమాకు సంబంధించి పలు చోట్ల ప్రీమియర్స్ ప్లాన్ చేశారు కానీ సెన్సార్ చిక్కుల వల్ల ఈ ప్రీమియర్ షోల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈటీవీ విన్ సహా నిర్మాతలు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతోంది. ₹100 టికెట్ ధరతో సామాన్యుడికి చేరువ కావాలని తిరువీర్ ఎన్నో ప్రమోషన్లు చేశారు. ఇలాంటి టైమ్లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం టీంని ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మేకర్స్ అవసరమైన పత్రాలను సమర్పించి లేదా అభ్యంతరకర సీన్లను కట్ చేసి క్లియరెన్స్ తెచ్చుకుంటారు. చూడాలి మరి ఏమవుతుందో?
తాజావార్తలు
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
-
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
-
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
-
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!