Ilaiyaraaja: ఇళయరాజాకు అవమానం.. స్పందించిన ఆలయ సిబ్బంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇళయరాజా తమిళ చిత్ర పరిశ్రమలో కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా సంగీత దిగ్గజం. తరచూ వివాదాస్పదంగా మాట్లాడుతూ ఆయన వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇళయరాజాకి జరిగిన ఓ సంఘటన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లకుండా సంగీత స్వరకర్త ఇళయరాజా ఆపి గర్భగుడి బయట నిలబెట్టిన ఘటన జనాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు ప్రభుత్వ చిహ్నమైన రాజ గోపురం ఉన్న శ్రీ ఆండాళ్ ఆలయం ఆది పుర కోటగై వద్ద ఇళయరాజా స్వరపరిచిన దివ్య బాసురం నాట్యాంజలి కార్యక్రమాన్ని ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించింది. దీనిలో పాల్గొనేందుకు ఇళయరాజా వచ్చారు. తమిళనాడు ప్రభుత్వ హిందూ ధర్మాదాయ శాఖ నియంత్రణలో ఉన్న ఆండాళ్ ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. ఇళయరాజాకి పూర్ణ కుంభ సన్మానం చేశారు. ఇళయరాజా ఆలయాన్ని సందర్శించి, ఆండాళ్ రెంగమన్నార్ దర్శనం కోసం గర్భగుడిలోకి ప్రవేశించారు, అప్పుడు సమీపంలోని జీయర్ స్వామీ ఇళయరాజాను గర్భగుడి వెలుపల నిలబడమని చెప్పారు.
Rachakonda CP: కేసు వేసిన వ్యక్తిని కలిసిన మోహన్ బాబు.. చర్యలు తప్పవు!
Also Read
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
- Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
కాసేపు ఆలోచించిన తర్వాత, ఇళయరాజా స్వామి ఉన్న గర్భగుడి నుండి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వటపత్ర శాయి మందిరం, పెరియ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించిన ఆయన అనంతరం పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ విషయమై ఆండాళ్ ఆలయ కార్యనిర్వహణాధికారి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భగుడి ఎదుట ఉన్న అర్థ మండపంలో ఉత్సవ విగ్రహాలను శాశ్వతంగా ఉంచినందున జీయర్లను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నారు. జీయర్తో వచ్చిన ఇళయరాజా అర్థ మండపంలోకి తెలియకుండా లోపలికి రాగానే బయట నిల్చుని లోపల ఉన్న వారు ఎవరినీ అనుమతించబోమని చెప్పడంతో ఆయన బయట నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారని వివరించారు” ఆండాళ్ ఆలయం శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో ‘విష్ణువు’ వటపత్ర శాయిగా పూజలందుకుంటున్నాడు. లక్ష్మీదేవిని ఇక్కడ ఆండాళ్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఆండాళ్ ధరించిన మాలను వడభట్రసాయి పెరుమాళ్కు సమర్పించడం ఆనవాయితీ.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!