Telugu Theater Closure Threat: థియేటర్ల మూసివేత టెన్షన్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశం?
- పర్సెంటేజ్, రెంట్ల అంశం మీద వివాదం
- థియేటర్ల మూసివేతకు సిద్దమైన ఎగ్జిబిటర్లు
- ఈ అంశం మీద రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్
తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ ఎగ్జిబిటర్లు తీవ్ర నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించే విధానాన్ని నిలిపివేసి, కేవలం పర్సెంటేజ్ విధానంలోనే చెల్లింపులు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఈ షరతును అంగీకరించకపోతే, జూన్ 1, 2025 నుంచి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ అంశం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read:Balakrishna : 10 నిమిషాల కోసం 22 కోట్లు?
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
ఈ సమావేశంలో దిల్ రాజు, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. అద్దె విధానం వల్ల థియేటర్ల నిర్వహణలో నష్టాలు ఎదురవుతున్నాయని, పర్సెంటేజ్ విధానం ద్వారా మాత్రమే ఆర్థిక సమతుల్యత సాధ్యమవుతుందని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ గిల్డ్కు లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రేపు (మే 21, 2025) సాయంత్రం 4 గంటలకు ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Also Read:Rana Naidu 2: నెట్ఫ్లిక్స్లో ‘రానా నాయుడు 2’ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచంటే?
ఈ సమావేశంలో ఎగ్జిబిటర్ల డిమాండ్ను చర్చించి, రెండు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరగనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే, జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడే ప్రమాదం ఉంది, ఇది సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే, కొత్త సినిమాల నిర్మాతలకి ఇబ్బంది కర అంశమే. రేపటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశం ఫలితం సినీ పరిశ్రమలోని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చర్చలు సఫలమైతే, థియేటర్ల మూసివేతను నివారించే అవకాశం ఉందని, రెండు వర్గాల మధ్య సమస్య పరిష్కారమై సినీ పరిశ్రమ సాధారణ స్థితికి చేరుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!