Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రధానిని కలవడం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోడీని సాక్షాత్తూ దైవాంశసంభూతుడిగా, మహనీయుల కలబోతగా అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇటీవల తెలంగాణా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన తనికెళ్ల భరణి.. ఆయనతో ఆత్మీయంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సందర్భంగా తనదైన శైలిలో గొప్ప కవితాత్మక, భక్తి భావంతో కూడిన క్యాప్షన్ను జతచేశారు. “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.. ఇక మనం వారిని చూడలేము కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యమైంది”* అని తన అభిమానాన్ని, చాటుకున్నారు.
Also Read
సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు, సాహిత్యం పట్ల ఎంతో మక్కువ చూపే తనికెళ్ల భరణి.. దేశ ప్రధానిని స్వయంగా కలవడం, ఆయనను దేవుళ్లతో సమానంగా భావిస్తూ ఉన్న ఫోటోను పంచుకోవడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆయన చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కొందరు ఆయన భక్తి భావాన్ని, మోడీపై ఉన్న గౌరవాన్ని మెచ్చుకుంటుండగా.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!