సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కరుపు’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్ర అధికారిక ట్రైలర్ను నేడు (మే 10) రాత్రి 7 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 14న గ్రాండ్గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్తో కూడిన ఈ సినిమా సమ్మర్ బిగ్గెస్ట్ రిలీజ్లలో ఒకటిగా నిలవనుంది.
ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, చాలా కాలం తర్వాత సూర్య సరసన త్రిష నటిస్తుండటం విశేషం. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, స్వాసిక వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, నేడు రాబోయే ట్రైలర్ సినిమా కథాంశంపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ప్రభు ఎస్.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The much awaited announcement is here 🔥#KaruppuTRAILER from today, 7PM!#Karuppu in theatres worldwide from May 14th 💥
A @SaiAbhyankkar Musical 🎵@Suriya_offl @trishtrashers @RJ_Balaji @dop_gkvishnu @prabhu_sr #Indrans @natty_nataraj #Swasika @SshivadaOffcl #SupreethReddy… pic.twitter.com/yeebYrX4nH
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 10, 2026
